చరణ్ - విలన్ - డైరెక్షన్...

  • IndiaGlitz, [Tuesday,April 26 2016]

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ విల‌న్ డైరెక్ష‌న్ చేస్తానంటున్నారు. ఇంత‌కీ ఎవరా చ‌ర‌ణ్ - విల‌న్ అని తెగ ఆలోచిస్తున్నారా..? ఆయ‌నే అర‌వింద్ స్వామి. త‌ని ఓరువ‌న్ మూవీలో స్టైలీష్ విల‌న్ గా న‌టించిన అర‌వింద్ స్వామి..తని ఓరువ‌న్ తెలుగు రీమేక్ లో కూడా అదే పాత్ర‌ను పోషిస్తుండ‌డం విశేషం.
అర‌వింద్ స్వామి డియ‌ర్ డాడ్ అనే చిత్రంతో బాలీవుడ్ లో కూడా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇన్నాళ్లు బిజినెస్ లో బిజీగా ఉన్న అర‌వింద్ స్వామి ఇక నుంచి త‌న దృష్టి అంతా సినిమాల పైనే అంటున్నాడు. అంతే కాదండోయ్..రెండు స్ర్కిప్ట్ లు రెడీగా ఉన్నాయి. త్వ‌ర‌లో డైరెక్ష‌న్ కూడా చేస్తానంటున్నాడు. ఈ సంవ‌త్స‌రంలోనే సినిమా స్టార్ట్ చేస్తాను. అయితే...డైరెక్ష‌న్ చేసేది త‌మిళ్ లోనా...హిందీలోనా అనేది ఇప్పుడే చెప్ప‌లేను అంటున్నాడు. రెగ్యుల‌ర్ మూవీస్లా కాకుండా కొత్త‌ద‌నంతో కొత్త సినిమా తీస్తానంటున్న అర‌వింద్ స్వామి ఆల్ ది బెస్ట్.

More News

శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ హ్యాట్రిక్ చిత్రం

లౌక్యం, డిక్టేటర్ వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ హీరోగా సినిమా రూపొందనుంది. గోపీచంద్ హీరోగా, గతంలో లక్ష్యం, లౌక్యం వంటి రెండు సూపర్ హిట్ చిత్రాలను డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఎట్టకేలకు సూర్య, అనుష్కల పెళ్లి జరిగింది...

సూర్య, అనుష్కలకు పెళ్లేంటనుకుంటున్నారా? రియల్ లైఫ్ లో కాదులెండి..రీల్ లైఫ్ లో, సూర్య, అనుష్క జంటగా హరి దర్శకత్వంలో రూపొందుతోన్న సక్సెస్ ఫుల్ చిత్రం సింగం ఇప్పుడు మూడో సీక్వెల్ ఎస్3 చిత్రీకరణ జరుపుకుంటుంది.

బ్రహ్మోత్సవం ఆడియో రిలీజ్ వాయిదా..

సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న చిత్రం బ్రహ్మోత్సవం.ఈ చిత్రాన్నితెలుగు,తమిళ్ భాషల్లో పి.వి.పి సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.

అన్న‌య్య - త‌మ్ముడు ఒకేసారి..

అన్న‌య్య మెగాస్టార్ చిరంజీవి - త‌మ్ముడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్....వీళ్లిద్ద‌రు ఒకేరోజు త‌మ చిత్రాల‌ను ప్రారంభిస్తున్నార‌ట‌. మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రాన్ని ఈ నెల 29న ప్రారంభించ‌డానికి ముహుర్తం ఖ‌రారు చేసిన విష‌యం తెలిసిందే.

నాలుగోసారి క‌ల‌సి న‌టిస్తున్నయువ జంట‌..

నాలుగోసారి క‌ల‌సి న‌టిస్తున్న యువ జంట‌..ఎవ‌రో కాదు నాగ చైత‌న్య - స‌మంత‌. వీరిద్ద‌రు తొలిసారి ఏమాయ చేసావే చిత్రంలో క‌లిసి న‌టించారు. ఆత‌ర్వాత మ‌నం, ఆటోన‌గ‌ర్ సూర్య చిత్రాల్లో  న‌టించారు. తాజాగా నాలుగోసారి చైత‌న్య - స‌మంత క‌లిసి న‌టిస్తున్నారు.