Ram Charan:చిరంజీవి @ 45 Years of Industry.. రాం చరణ్ స్పెషల్ పోస్ట్ , వైరల్

  • IndiaGlitz, [Friday,September 22 2023]

మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారుండరు. స్వయంకృషి, పట్టుదల, క్రమశిక్షణతో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా తెలుగు సినీ పరిశ్రమలో స్టార్‌గా ఎదిగారు. దాదాపు మూడు దశాబ్ధాల పాటు టాలీవుడ్‌ను మకుటం లేని మహారాజుగా ఏలారు. ఒకానొక దశలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్‌ను మించిన స్థార్‌గా, ఆయన కంటే ఎక్కువ పారితోషికం తీసుకునే నటుడిగా చిరంజీవి సంచలనం సృష్టించారు. అయితే ఎంత ఎదిగినా ఒదిగివుండే తత్వం, మంచితనం, మానవత్వం మెగాస్టార్ సొంతం. అందుకే ఆయనను స్పూర్తిగా తీసుకుని ఎంతోమంది హీరోలు, టెక్నీషియన్లు వెండితెరపైకి వచ్చారు.. వస్తున్నారు.

1978 సెప్టెంబర్ 22న విడుదలైన ప్రాణం ఖరీదు :

చిరు జీవితంలో ఆగస్ట్ 22, సెప్టెంబర్ 22లకు ప్రత్యేక స్థానం వుంది. ఆగస్ట్ 22న ఆయన జన్మిస్తే.. సెప్టెంబర్ 22న మెగాస్టార్ నటుడిగా జన్మించిన రోజు. ఆ రోజున తెలుగు ప్రేక్షకులకు చిరంజీవి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. మెగాస్టార్ వెండితెరపై కనిపించిన తొలి చిత్రం ‘‘ప్రాణం ఖరీదు’’ 1978 సెప్టెంబర్ 22న విడుదలైంది. అలా నటుడిగా చిరంజీవి 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రికి సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలియజేశారు. అలాగే చిరంజీవి నటించిన సినిమాల్లో ఆయన స్టిల్స్‌తో కూడిన ఫోటోను ‘‘45 years of mega journey in cinema ’’ అంటూ పోస్ట్ చేశారు.

థ్యాంక్స్ నాన్న అంటూ చరణ్ పోస్ట్ :

‘‘మీరు తెరపై నటనతో, తెర వెనుక వ్యక్తిత్వంతో ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తూనే వున్నారు. అంకిత భావం, కష్టపడే తత్వం, క్రమశిక్షణ వంటివి నాలో పెంపొందినందుకు థ్యాంక్స్ నాన్న’’ అంటూ చరణ్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగాభిమానులు, సినీ ప్రముఖులు చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు.

More News

చంద్రబాబుకు బిగ్ షాక్.. సీఐడీ కస్టడీకి కోర్ట్ అనుమతి

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో షాక్ తగిలింది. ఆయనను రెండ్రోజుల పాటు సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ

Chandrababu Naidu:స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం : ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు చుక్కెదురు .. క్వాష్ పిటిషన్ కొట్టివేత

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది.

Nandamuri Balakrishna:ఏపీ అసెంబ్లీలో బాలయ్య రచ్చ  : విజిల్స్ వేస్తూ, సీట్లపైకెక్కి నినాదాలు.. స్పీకర్ ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రెండో రోజు కూడా టీడీపీ సభ్యులు సభలో నానా హంగామా సృష్టించారు.

Chandrababu Naidu: చంద్రబాబుకు ఏసీబీ కోర్ట్ షాక్, జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో వున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు షాక్ తగిలింది.

Bigg Boss 7 Telugu : గౌతమ్‌కు అన్యాయం .. సందీప్‌పై గుస్సా, ప్రియాంకకున్న ధైర్యం అమర్‌‌కు లేకపోయే

బిగ్‌బాస్ 7 తెలుగులో మూడో హౌస్‌మెట్ ఛాన్స్ కొట్టేసేందుకు కంటెస్టెంట్స్ కుస్తీ పడుతున్నారు. శోభాశెట్టి, అమర్‌దీప్ చౌదరి, ప్రిన్స్ యావర్‌లను