చరణ్ , బోయపాటి.. ఓ ఐటమ్ సాంగ్

  • IndiaGlitz, [Friday,February 02 2018]

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కైరా అద్వానీ కథానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా న‌టిస్తున్నారు. టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇక చరణ్ కి అన్నా వదినలుగా తమిళ నటుడు ప్రశాంత్, స్నేహ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ఇటీవల మొదటి షెడ్యూల్ ను పూర్తిచేసుకున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైన‌ర్‌...ఈ నెల నుంచి రెండవ షెడ్యూల్ ను ప్రారంభించుకోనుంది. ఈ షెడ్యూల్లో చరణ్ ఈ నెల 19 నుంచి నిరవధికంగా చిత్రీకరణలో పాల్గొన‌నున్నారు. ఇదిలా ఉంటే.. స్పెషల్ సాంగ్స్ కి కేరాఫ్‌ అడ్రస్ గా ఉండే బోయపాటి, దేవిశ్రీ .. ఈ చిత్రంలో కూడా ఒక స్పెషల్ సాంగ్ ను చిత్రీకరించే ఆలోచనలో ఉన్నారట‌. ఇప్పటికే ఈ పాటని దేవిశ్రీ స్వరపరచినట్టు సమాచారం. ఈ పాటలో ఒక టాప్ హీరోయిన్ చేత నర్తింపజేయాలని దర్శకుడు భావిస్తున్నారట. ఇందుకోసం.. ఇప్ప‌టికే పలు టాప్ హీరోయిన్ల పేర్లను కూడా పరిశీలించినట్టు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో ఆ హీరోయిన్ పేరును కూడా వెల్లడించనుంది చిత్ర బృందం. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని విజయదశమి కానుకగా విడుదల చేయాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నారు.

More News

రిలీజ్ కు ముందే ఓ చిన్న చిత్రానికి క్రేజీ ఆఫర్స్!!

ఓ నూతన దర్శకుడు,నూతన నిర్మాణ సంస్థలో రూపొందిన 'ఇంతలో ఎన్నెన్ని వింతలో'

జాతీయ మహిళా సదస్సు 2017...శిల్పారామం...హైదరబాద్

ఫ్రగ్న్యా భారతి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ మహిళా సదస్సు Feb 1 వ తేదీ నుంచి 3వ తేదీ వరకు హైదరబాద్ లోని శిల్ప కలా వేదిక యందు ఘనగా జరుగుతున్నాయి.

ఇందిరా గాంధీ పాత్ర కోసం ఆ ఇద్ద‌రు..

విక్టరీ వెంకటేష్, సెన్సేషనల్ డైరెక్టర్ తేజ కలయికలో 'ఆటా నాదే వేటా నాదే' (ప్ర‌చారంలో ఉన్న పేరు) సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఆ మధ్య ఈ మూవీని 90 నుంచి 120 రోజుల్లో తేజ పూర్తిచేయనున్నారని కథనాలు వచ్చాయి. ఇప్పుడు వాటికి ఊతమిస్తూ.. తేజ ఈ చిత్రాన్ని శరవేగంగా అంటే ఆగష్టు నెలకల్లా పూర్తిచేయడానికి ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింķ

కొత్త ద‌ర్శ‌కుడితో అఖిల్ చిత్రం?

కింగ్ నాగార్జున తన రెండో కుమారుడు అఖిల్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను ప్రముఖ డైరెక్టర్ వి.వి.వినాయక్‌కు అప్పగించారు. నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై.. 'అఖిల్' చిత్రాన్ని వినాయక్ తెరకెక్కించారు. ఆ సినిమా ఆశించినంత విజయం సాధించక పోవడంతో..రీ-లాంచింగ్ అంటూ అఖిల్ రెండో సినిమాని బ్రిలియంట్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ ĵ

సెన్సార్ పూర్తి చేసుకున్న'గాయత్రి'

డా. మోహన్ బాబు ప్రధాన పాత్ర లో నటిస్తున్న 'గాయత్రి' చిత్రం సెన్సర్స్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని ఫిబ్రవరి 9 న భారీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు అద్భుత స్పందన వస్తుంది. మోహన్ బాబు ఇంటెన్స్ లుక్ మరియు పవర్ఫుల్ డైలాగులతో కూడిన ట్రైలర్ చిత్రంపై ఆసక్తిని భారీగా పెంచేసాయి. ఎస్ తమన్ స్వరపరిచిన చిత్ర పాటలకు విశేష స&#