కూరగాయలమ్మిన రకుల్

  • IndiaGlitz, [Saturday,February 06 2016]

ప్రస్తుతం వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చర్య సినీ అభిమానులను, ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. అదేంటనుకుంటున్నారా? కూరగాయలు అమ్మటం. కె.పి.హెచ్.బి కాలనీలో కూరగాయలు అమ్ముతాని తన ట్విట్టర్ అకౌంట్ లో మెసేజ్ పెట్టిన రకుల్ చెప్పినట్టుగానే ఈరోజు ఉదయం మంజీరా మాల్ కు ఎదురుగా ఉన్న మార్కెట్ లో కూరగాయలమ్మింది.

మరి రకుల్ కు కూరగాయలు అమ్మాల్సిన పరిస్థితేంటని అనుకుంటున్నారా..అసలు విషయంలోకి వెళితే, మంచు లక్ష్మి.. 'మేము సైతం' పేరుతో మరో టివి షో ప్రారంభిస్తుంది. సమాజ సేవ నేపథ్యంతో రూపొందించిన ఈ కార్యక్రమం కోసం రకుల్ ప్రీత్‑సింగ్ ఈ రిస్క్ చేసింది. ఇలా రకుల్ అమ్మిన కూరగాయల ద్వారా వచ్చిన డబ్బును ఏదైనా సామాజిక సేవా కార్యక్రమం కోసం వినియోగించనున్నారు.