ఒకేసారి ఆ ఇద్దరి హీరోలతో రకుల్..!

  • IndiaGlitz, [Friday,December 09 2016]

టాలీవుడ్ లో అన‌తికాలంలోనే టాప్ హీరోయిన్ అనిపించుకుని వ‌రుస అవ‌కాశాలు ద‌క్కించుకుంటున్న హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్..! తాజాగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో న‌టించిన ధృవ సినిమాతో స‌క్సెస్ సాధించింది. సూప‌ర్ స్టార్ మ‌హేష్ తో మురుగుదాస్ మూవీలో న‌టిస్తుంది. ఇదిలా ఉంటే...నాగ‌చైత‌న్య హీరోగా సోగ్గాడే చిన్ని నాయ‌నా ఫేమ్ క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్నిఅన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై నాగార్జున నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో చైత‌న్య స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది. ఈ మూవీ ప్ర‌స్తుతం వైజాగ్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. మ‌రో వైపు ర‌కుల్ ప్రీత్ సింగ్ సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న విన్న‌ర్ చిత్రంలో న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని మ‌లినేని గోపీచంద్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ను వైజాగ్ కు ద‌గ్గ‌ర‌లో గ‌ల అర‌కులో జ‌రుగుతుంది. ఈ రెండు చిత్రాల్లో ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ కావ‌డం విశేషం. ఒక‌రోజు చైతు మూవీ, మ‌రో రోజు తేజు మూవీలో న‌టిస్తూ ఫుల్ బిజీ అట‌ ర‌కుల్. అది సంగ‌తి..!