అందుకే చైతన్య సినిమా చేస్తున్నాను - రకుల్ ప్రీత్ సింగ్..!

  • IndiaGlitz, [Wednesday,December 14 2016]

వ‌రుస‌గా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్. చ‌ర‌ణ్ ధృవ సినిమాతో స‌క్సెస్ సాధించిన‌ ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు, నాగ‌చైత‌న్య‌, సాయిధ‌ర‌మ్ తేజ్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కార్తీ ల‌తో సినిమాలు చేస్తుంది. అయితే...నాగ‌చైత‌న్య‌తో చేస్తున్న సినిమాలో మీ క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుంది అని ర‌కుల్ ని అడిగితే...ఈ మూవీలో నా క్యారెక్ట‌ర్ గురించి పూర్తి వివ‌రాలు త‌ర్వాత చెబుతాను.
అయితే ఈ మూవీ గురించి చెప్పాలంటే...కెరీర్ లో ఎప్ప‌టికీ గుర్తుండే క్యారెక్ట‌ర్స్ చేసే అవ‌కాశం చాలా అరుదుగా వ‌స్తుంటుంది. అలాంటి అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు వ‌దులుకోకూడ‌దు. నా కెరీర్ లో ఎప్ప‌టికీ గుర్తుండే క్యారెక్ట‌ర్ ఈ మూవీలో చేస్తున్నాను. అందుక‌నే ఈ క‌థ విన్న వెంట‌నే ఓకే చెప్పాను. డేట్స్ ఎడ్జెట్స్ కాక‌పోతే...వేరే సినిమాల డేట్స్ ఎడ్జెట్స్ చేసి అయినా స‌రే...ఈ మూవీ చేయాలి అని మా మేనేజ‌ర్ కి చెప్పాను అంటూ చైతు మూవీ పై ఎక్స్ పెక్టేష‌న్స్ పెంచేసింది ర‌కుల్..!