శ్రీదేవిగా ర‌కుల్ లుక్ అదిరిందిగా!

  • IndiaGlitz, [Wednesday,October 10 2018]

నిన్న‌టి త‌రం అందాల న‌టి శ్రీదేవి గా ర‌కుల్ ప్రీత్‌సింగ్ తెర‌పై త‌ళుక్కుమ‌ని మెర‌వ‌నున్నారు. 'య‌న్‌.టి.ఆర్‌' బ‌యోపిక్ కోసం ర‌కుల్ ఈ పాత్ర‌ను పోషిస్తున్నారు. అక్టోబ‌ర్ 10 ర‌కుల్ ఫ్రీత్‌సింగ్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా 'య‌న్‌.టి.ఆర్‌' సినిమా యూనిట్ ఆమె ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేసింది.

ఈ ఫొటోలో ఆమె ఆకు చాటు పిందె త‌డిసె పాట‌లో శ్రీదేవి క‌నిపించిన‌ట్టు క‌నిపిస్తున్నారు. అంటే.. య‌న్.టి.ఆర్ బ‌యోపిక్ తొలి భాగం క‌థానాయ‌కుడులో ర‌కుల్, బాల‌య్య మీద ఆకు చాటు పిందె త‌డిసె పాట ఉండ‌బోతుంద‌న్న‌మాట‌. ర‌కుల్ లుక్‌కి మంచి స్పంద‌న వ‌స్తోంది.ఈ పాత్ర కోసం తాను చాలా క‌ష్ట‌ప‌డ్డాన‌ని, శ్రీదేవి న‌టించిన పాత సినిమాలు కూడా చూశాన‌ని ఇప్ప‌టికే ర‌కుల్ ప్రీత్ సింగ్ చెప్పారు.

య‌న్.టి.ఆర్ బ‌యోపిక్‌ను క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు అని రెండు భాగాలుగా రూపొందించ‌నున్న విష‌యం తెలిసిందే. తొలి భాగాన్ని జ‌న‌వ‌రి 9న , రాజ‌కీయ రంగానికి సంబంధించిన మ‌హానాయ‌కుడు భాగాన్ని జ‌న‌వ‌రి 24న విడుద‌ల చేయ‌నున్నారు. య‌న్‌.టి.ఆర్ బ‌యోపిక్ గురించి తెలుస్తున్న ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు అభిమానుల్లో పండుగ వాతావ‌ర‌ణాన్ని నింపుతున్నాయి.

ఈ సినిమాను ఎన్‌బీకే ఫిల్మ్స్ ఎల్ ఎల్ పీ సంస్థ‌పై నంద‌మూరి బాల‌కృష్ణ నిర్మిస్తున్నారు. వారాహి చ‌ల‌న‌చిత్రం, విబ్రి మీడియా సంస్థ‌లు స‌మ‌ర్పిస్తున్నాయి. సాయి కొర్ర‌పాటి, విష్ణు స‌హ నిర్మాత‌లు.

More News

స్నేహితుడు సలహాలు ఇవ్వాల్సిన పని లేదు - త్రివిక్ర‌మ్‌

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా మమ‌త స‌మ‌ర్ప‌ణ‌లో హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై .. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.రాధాకృష్ణ‌(చిన‌బాబు) ఈ చిత్రాన్ని నిర్మించారు.

24 కిస్సెస్ సెన్సార్ పూర్తి.. అక్టోబ‌ర్ 26న విడుద‌ల‌

24 కిస్సెస్ సినిమా సెన్సార్ కార్యక్ర‌మాలు పూర్త‌య్యాయి. 'A' స‌ర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. అక్టోబ‌ర్ 26న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు నిర్మాత‌లు.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'మాగ్నెట్'

విడుదల అయిన ఒక్క ఫస్ట్ లుక్ తోనే కుర్రకారులో అంచనాలు పెంచేసిన చిత్రం మాగ్నెట్. ఈ మధ్యే ఈ సినిమా యూనిట్ సాక్షి చౌదరి హాట్ లుక్ విడుదల చేశారు,

'సాహో' లో ఎయిర్ టెల్ అమ్మ‌డు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా యంగ్ డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా 'సాహో'.

'మిస్ట‌ర్ మ‌జ్ను' వాయిదా?

అఖిల్ మూడో సినిమా 'మిస్ట‌ర్ మ‌జ్ను'. 'తొలిప్రేమ' ఫేమ్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో బివిఎస్ఎన్‌.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మాణంలో రూపొందుతోంది.