క‌న్‌ఫ‌ర్మ్ చేసిన ర‌కుల్‌

  • IndiaGlitz, [Sunday,November 12 2017]

తెలుగులో అన‌తికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది ఢిల్లీ డాళ్ ర‌కుల్ ప్రీత్ సింగ్‌. ఇక్క‌డ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ మ‌హారాజ్ ర‌వితేజ వంటి అగ్ర క‌థానాయ‌కుల‌తో సినిమాలు చేసింది. మ‌రోవైపు త‌మిళం, హిందీలోనూ సినిమాలు చేస్తున్న ర‌కుల్‌కి.. అక్క‌డైతే స్టార్ హీరోల సినిమాల్లో న‌టించే అవ‌కాశం ఇప్ప‌టివ‌ర‌కు రానేలేదు.

ఇదిలా ఉంటే.. తాజాగా త‌మిళంలో విజ‌య్‌, సూర్య వంటి స్టార్ హీరోల చిత్రాల్లో ర‌కుల్‌ న‌టించే అవ‌కాశ‌ముంద‌ని వార్త‌లు వినిపించాయి. అయితే ఆ విష‌యాన్ని ర‌కుల్ ఎక్క‌డా ప్ర‌స్తావించలేదు.కానీ తాజాగా ఖాకి సినిమా ప్ర‌మోష‌న్స్‌లో సూర్యకీ జోడీగా న‌టించ‌బోతున్న‌ట్లు ఈ అమ్మ‌డు క‌న్‌ఫ‌ర్మ్ చేసింది.

సెల్వ రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా జ‌న‌వ‌రిలో ప్రారంభ‌మై.. వ‌చ్చే ఏడాది దీపావ‌ళికి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తెలుగులో మాత్రం ఈ ముద్దుగుమ్మ కొత్త‌గా ఏ సినిమాకీ సంత‌కం చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

More News

పెంకి అమ్మాయిగా రెజీనా

పిల్లా నువ్వు లేని జీవితం, ప‌వ‌ర్‌, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌, జో అచ్యుతానంద వంటి విజ‌యవంత‌మైన చిత్రాల్లో సంద‌డి చేసిన యువ క‌థానాయిక రెజీనా. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుపోతున్న ఈ చెన్నై చిన్న‌ది.. ప్ర‌స్తుతం నారా రోహిత్‌కి జోడీగా బాల‌కృష్ణుడు చిత్రం చేస్తోంది.

సుధీర్‌తో అదితి.. డౌట్‌లో ప‌డింది

జెంటిల్‌మాన్‌, అమీతుమీ చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌ని సొంతం చేసుకున్నారు ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌. ప్ర‌స్తుతం ఆయ‌న యువ క‌థానాయ‌కుడు సుధీర్‌బాబుతో ఓ సినిమా చేసేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే.

ఒకే హీరోయిన్‌తో నాగ‌శౌర్య రెండు చిత్రాలు

ఊహ‌లు గుస‌గుస‌లాడే, క‌ళ్యాణ వైభోగ‌మే, జో  అచ్యుతానంద చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య‌. ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరో చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉన్నాడు.

'భ‌ర‌త్ అను నేను' లోనూ అలాగే..

ర‌చ‌యిత నుంచి ద‌ర్శ‌కుడిగా మారిన కొరటాల శివ.. వ‌రుస విజ‌యాల‌తో అన‌తి కాలంలోనే టాప్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు. మిర్చి, శ్రీ‌మంతుడు, జ‌న‌తా గ్యారేజ్.. ఇలా ఇప్ప‌టి వ‌ర‌కు స్టార్ హీరోల‌తోనే త‌న సినిమాల‌ను చేసిన శివ‌.. త‌న నాలుగో చిత్రాన్ని కూడా మ‌రో స్టార్ హీరోతో చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

మ‌హేష్ కోసం హీరోయిన్ పాట‌

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం భ‌ర‌త్ అనే నేను. హ్యాట్రిక్ చిత్రాల ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ రూపొందిస్తున్న ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది.