'రాక్షస కావ్యం' ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ రిలీజ్

  • IndiaGlitz, [Monday,November 15 2021]

నవీన్ బేతిగంటి,అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్,దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా రాక్షస కావ్యం. ఈ చిత్రాన్ని గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా..శ్రీమాన్ కీర్తి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈ సంస్థలు జార్జి రెడ్డి, గువ్వ గోరింక చిత్రాలను నిర్మించాయి. దాము రెడ్డి, ఉమేష్ చిక్కు నిర్మాతలు. నవీన్ రెడ్డి, వసుందర దేవి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రాక్షస కావ్యం సినిమా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ను తాజాగా రివీల్ చేశారు.

ఫస్ట్ లుక్ సందర్భంగా విడుదల చేసిన వీడియో చూస్తే... విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంతో శ్రీ వెంకటేశ్వరుడి ఫొటోను చూపిస్తూ మొదలైంది. అక్కడే టైటిల్ రివీల్ చేశారు. ..ఒక్క మాట యాది ఉంచుకో బిడ్డ, మనసంటోళ్లు పదిమంది చచ్చిపోయినా ఎవ్వరికి ఫరక్ పడదు, కానీ ఒక్కడు సదువుకుంటే మనసంటోళ్లను వందమందిని బతికిస్తడు... అనే పవర్ ఫుల్ డైలాగ్ చెప్పించారు. కావ్యం మొదలైంది అంటూ వీడియో చివరలో వేశారు. శివ సినిమా కటౌట్ థియేటర్ ను చూపించడం ద్వారా కథ 90వ దశకానికి సంబంధించినదిగా అర్థమవుతోంది. రాక్షస కావ్యం సినిమాను పీరియాడిక్ సోషల్ యాక్షన్ డ్రామాగా చెప్పొచ్చు.

నవీన్ బేతిగంటి,అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్,దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి, యాదమ్మ రాజు, శివరాత్రి రాజు, ప్రవీణ్ దాచరం, కోట సందీప్, విజయ్ అంబయ్య, వినయ్ కుమార్ పర్రి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ అండ్ కలరిస్ట్ - వెంకటేష్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ - రుషి కోనాపురం, సంగీతం - రాజీవ్ రాజ్, శ్రీకాంత్, ఆర్ట్ - గాంధీ నడికుడికర్, సాహిత్యం - మిట్టపల్లి సురేందర్, లైన్ ప్రొడ్యూసర్ - సృజన్ పింగిలి, సౌండ్ డిజైన్ - నాగార్జున తాళ్లపల్లి, వీఎఫ్ఎక్స్ అండ్ పబ్లిసిటీ డిజైన్ - అశోక్ మోచర్ల, కో ప్రొడ్యూసర్స్, నవీన్ రెడ్డి, వసుంధర దేవి, పీఆర్వో - జి. ఎస్.కె మీడియా, నిర్మాతలు - దాము రెడ్డి, ఉమేష్ చిక్కు, రచన, దర్శకత్వం - శ్రీమాన్ కీర్తి

More News

సుమంత్ కొత్త చిత్రం 'అహం రీబూట్' ప్రారంభం

సుమంత్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా అహం రీబూట్. ఈ చిత్రాన్ని వాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్,

హైదరాబాద్ : కేబీఆర్ పార్క్ వద్ద సినీనటి చౌరాసియాపై దాడి.. మొబైల్ చోరీ, రంగంలోకి పోలీసులు

వాకింగ్‌కు వెళ్లిన సినీనటీపై దాడి ఘటనతో తెలుగు చిత్రపరిశ్రమ ఉలిక్కిపడింది. బంజారాహిల్స్‌ కేబీఆర్‌ పార్క్‌ వద్ద ఆదివారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది.

బిగ్‌బాస్ 5 తెలుగు: మాట తప్పిన నాగ్.. జెస్సీకి సారీ, హౌస్ నుంచి ఔట్

బిగ్‌బాస్ 5 తెలుగు సక్సెస్‌ఫుల్‌గా పది వారాలు, 71 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఆదివారం అందులోనూ చిల్డ్రన్స్ డే కావడంతో హోస్ట్ నాగార్జున ..

ఓడితే రికార్డ్స్‌లో .. గెలిస్తే చరిత్రలో  : చరణ్ వాయిస్‌తో ఆకట్టుకుంటున్న 'గని' టీజర్

కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అన్ని లవ్ స్టోరీలే చేశాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.

అంతా చక్కబడుతున్న వేళ మరో వివాదం.. రాజ్‌ కుంద్రా- శిల్పా శెట్టిపై చీటింగ్‌ కేసు

బాలీవుడ్ స్టార్ కపుల్ రాజ్‌కుంద్రా- శిల్పాశెట్టిలు మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే పోర్నోగ్రఫీ కేసుతో రాజ్ కుంద్రా పీకల్లోతు ఇబ్బందుల్లో వున్నారు.