రాజ‌మౌళి.. కుటుంబ‌క‌థా చిత్రం?

  • IndiaGlitz, [Sunday,December 10 2017]

స్టూడెంట్ నెం.1 నుంచి బాహుబ‌లి 2 వ‌ర‌కు వ‌రుస విజ‌యాల‌తో సంచ‌ల‌నం సృష్టించిన ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి. బాహుబ‌లి సిరీస్‌తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుని సంపాదించుకున్న రాజ‌మౌళి.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌తో మ‌ల్టీస్టార‌ర్ మూవీగా చేయ‌బోతున్నార‌ని చాలా రోజులుగా వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమా పూర్తి కుటుంబ క‌థా చిత్రంగా తెర‌కెక్క‌నుంద‌ని తెలిసింది. అయితే.. దీనిపై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. ప్ర‌స్తుతం రామ్‌చర‌ణ్‌.. రంగ‌స్థ‌లంతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం పూర్త‌య్యాక బోయ‌పాటితో ఓ సినిమా చేయ‌బోతున్నాడు చ‌ర‌ణ్‌.

ఇక ఎన్టీఆర్ విష‌యానికి వ‌స్తే.. జై ల‌వ కుశ త‌రువాత చిన్న విరామం తీసుకున్న తార‌క్‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో చేయ‌బోతున్నాడు. ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది ఆరంభంలో రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది.

More News

డ్యాన్స్ టీచ‌ర్‌గా రాశి ఖ‌న్నా

జై ల‌వ కుశ‌, ఆక్సిజ‌న్ చిత్రాల‌తో ఈ ఏడాది సంద‌డి చేసిన రాశి ఖ‌న్నా.. ప్ర‌స్తుతం ట‌చ్ చేసి చూడు, తొలి ప్రేమ చిత్రాల‌లో న‌టిస్తూ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

'జై సింహా' సెన్సార్ డేట్ ఫిక్స‌య్యిందా?

నట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన తాజా చిత్రం జై సింహా. సింహా, శ్రీ‌రామరాజ్యం చిత్రాల్లో బాల‌య్య‌కి జోడీగా న‌టించిన న‌య‌న‌తార ఈ చిత్రంలోనూ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు.

లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్

సుప్రసిద్ధ నటీమణి గౌతమి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటిగా అందలాన్నందుకొన్న గౌతమి ఆత్మవిశ్వాసంతో క్యాన్సర్ ను సైతం జయించి, తనలా మరెవరూ బాధపడకూడదనే దృఢ నిశ్చయంతో "లైఫ్ ఎగైన్" ఫౌండేషన్ ను ప్రారంభించారు.

మరో దృశ్యం ఆడియో విడుదల

కట్ల రాజేంద్ర ప్రసాద్, అవంతిక, గౌతమ్ , కోలా మధు సిందూర ముఖ్య పాత్రల్లో కట్ట రాజేంద్ర ప్రసాద్ దర్శకతంలో గంగోత్రి ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకం పై శ్రీపతి గంగాదాస్ నిర్మిస్తున్న మరో దృశ్యం చిత్రంలోని పాటలు ఆదివారం ఫిలిం ఛాంబర్ లో  విడుదల అయ్యాయి.

ఈ నెల 15న 'ప్రేమపందెం' విడుదల

ఎం.ఎం. అర్జున్‌ దర్శకత్వంలో శ్రీ లక్ష్మి ప్రొడక్షన్స్‌ పతాకంపై అనంతపురం జిల్లాకు చెంది ప్రముఖ విద్యాసంస్థల అధిపతి ఎం. లక్ష్మీనారాయణ నిర్మాతగా, జబర్‌దస్త్‌ వినోద్‌, కిరణ్‌ కళ్యాణ్‌, నరేష్‌, సాంబశిమ హీరోుగా, మీనాక్షి గోస్వామి హీరోయిన్‌గా నిర్మించిన చిత్రం 'ప్రేమపందెం'.