రజనీకాంత్ కి ఆపరేషన్ - అభిమానుల్లో ఆందోళన..

  • IndiaGlitz, [Friday,June 24 2016]

ర‌జ‌నీకాంత్ న‌టించిన క‌బాలి చిత్రాన్ని జులై 15న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తుండ‌గా...మ‌రో వైపు ర‌జ‌నీకాంత్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న‌ రోబో 2.0 చిత్రంలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే...రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు గ‌త కొన్ని రోజులుగా కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా రజనీకాంత్ కు ఈ రోజు అమెరికాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరుగుతున్నట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది.

అమెరికాకు వెళ్ళే ముందే రజనీ బాడీ మెజర్ మెంట్స్ ని శంకర్ తీసుకున్నార‌ట‌. ఎందుకంటే రోబో 2.0లో మిగిలిన సన్నివేశాల చిత్రీకరణ కోసమే మెజర్ మెంట్స్ తీసుకున్నాడని కోలీవుడ్ వార్తల సారాంశం. అయితే అమెరికాలో ర‌జ‌నీకాంత్ కి కిడ్నీ ఆపరేషన్ జరిగిందనే వార్తలతో అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. గ‌తంలో ఇలాగే వ‌చ్చిన వార్త‌ల‌పై క‌బాలి నిర్మాత స్పందించారు. మ‌రి...ఈసారి వ‌స్తున్న వార్త‌ల‌పై ర‌జ‌నీ ఫ్యామిలీ స్పందిస్తుందేమో చూడాలి.