అఖిల్ ను ప‌రిచ‌యం చేయ‌నున్న ర‌జ‌నీ..?

  • IndiaGlitz, [Tuesday,September 29 2015]

అక్కినేని వంశం నుంచి వ‌స్తున్న మూడోత‌రం యువ కెర‌టం అఖిల్. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 22న అఖిల్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నాడు. నెల రోజుల ముందు నుంచే ప‌క్కా ప్లానింగ్ తో ప్ర‌మోష‌న్ స్టార్ట్ చేసాడు. అఖిల్ టీజ‌ర్ ను బాలీవుడ్ టాప్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ తో లాంఛ్ చేసి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే.. అఖిల్ ఆడియో ఫంక్ష‌న్ లో ట్రైల‌ర్ ను టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో లాంఛ్ చేయించి మ‌రోసారి సెన్సేష‌న్ క్రియేట్ చేసాడు. ఇక‌... తెలుగు ప‌రిశ్ర‌మ‌కు మ‌రో నైజాంలా త‌యారైన ఓవ‌ర్ సీస్ లో ఇప్ప‌టికే ప్ర‌చారం ప్రారంభించాడు. ఓవ‌ర్ సీస్ లో సినిమా రిలీజ్ ముందు ప్ర‌మోష‌న్ స్టార్ట్ చేయ‌డం అనేది అఖిల్ నుంచి ప్రారంభ‌మ‌య్యింది. ఇలా...డిఫ‌రెంట్ స్టైయిల్లో ప్రమోష‌న్ చేస్తూ...త‌న స్టైలే వేరే అని చెప్ప‌క‌నే చెప్పాడు అఖిల్.

ఇప్పుడు త‌మిళ ప్రేక్ష‌కుల‌కు చేరువ అయ్యేలా పక్కా ప్లాన్ రెడీ చేసారు. అఖిల్ సినిమాను త‌మిళ్ లో సి.క‌ళ్యాణ్ రిలీజ్ చేస్తున్నారు. త్వ‌ర‌లో అఖిల్ ను త‌మిళ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసేందుకు చెన్నైలో ఓ భారీ కార్య‌క్ర‌మానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ను ఆహ్వానించారు. ర‌జ‌నీ తో అఖిల్ ను త‌మిళ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేయించాల‌నేది ప్లాన్. ర‌జ‌నీ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ కోసం ఎదురు చూస్తున్నారు. త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది. సినిమా ప్రారంభం నుంచి ప్ర‌మోష‌న్ వ‌ర‌కు ప‌క్కా ప్లానింగ్ తో...న్యూ స్టైల్లో దూసుకెళ్తు సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న‌ అఖిల్ రిలీజ్ త‌ర్వాత ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌నున్నాడో..?