భారీ పారితోషికం తీసుకోనున్న ర‌జ‌నీకాంత్‌?

  • IndiaGlitz, [Saturday,May 05 2018]

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌కున్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ద‌క్షిణాదిలో మాత్ర‌మే కాదు.. ఉత్త‌ర భార‌త‌దేశంలోనూ ఆయ‌న సినిమాల‌కి మంచి డిమాండ్ ఉంటుంది. వ‌య‌సు పెరిగే కొద్దీ.. త‌న క్రేజ్‌తో పాటు పారితోషికం కూడా అంత‌కంత‌కూ పెరుగుతోందే త‌ప్ప త‌గ్గ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో.. త‌న తాజా చిత్రం కోసం ఏకంగా రూ.65 కోట్లు అందుకోనున్నార‌ట ర‌జ‌నీ. పిజ్జా ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌న్ పిక్చ‌ర్ నిర్మిస్తున్న చిత్రంలో ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమా కోసం ఆయ‌న కేటాయించేది కేవ‌లం 40 రోజులే. అయితే పారితోషికం మాత్రం రోజుకి రూ.కోటికిపైగానే ఉండ‌నుంద‌ని కోలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ర‌జ‌నీకాంత్ 165వ చిత్రంగా తెర‌కెక్క‌నున్న ఈ సినిమా అతి త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ర‌జ‌నీ రెండు చిత్రాల‌తో సంద‌డి చేయ‌నున్నారు. జూన్ 7న ఆయ‌న తాజా చిత్రం కాలా విడుద‌ల కానుండ‌గా.. ఈ ఏడాది చివ‌ర లోపు 2.0 ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

More News

ఎన్టీఆర్ సినిమాలో ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న‌ సినిమాతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

క‌బీర్ లాల్ సార‌థ్యంలో ద‌క్షిణాది భాష‌ల్లో రీమేక్ అవుతున్న స్పానిష్ మూవీ 'జూలియాస్ ఐస్‌'

యు.ఎస్‌కు చెందిన యంగ్ అండ్ ఫ్రీ ఫిలింస్ ఎల్ఎల్‌సి, ఇండియాకు చెందిన మూవీ మేజిక్‌, ప్ల‌స్ ఎక్యుప్స్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా ... స్పానిష్‌లో సూప‌ర్ హిట్ థ్రిల్ల‌ర్ జూలియాస్ ఐస్‌

సెన్సార్ వారి మెప్పు పొందిన 'మహానటి' 

సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని, ప్రపంచ వ్యాప్తంగా మే 9 న భారీ విడుదలకు సిద్ధంగా ఉంది 'మహానటి'. సెన్సార్ వారు క్లీన్ 'యూ' సర్టిఫికెట్ ఇవ్వడమే కాకుండా చిత్రం పై ప్రశంసల జల్లు కురిపించారు.

'మెహబూబా' సెన్సార్‌ పూర్తి - మే 11 విడుదల

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఆకాష్‌ పూరి హీరోగా లావణ్య సమర్పణలో

పాట చిత్రీక‌ర‌ణ‌లో..'తేజ్ ఐ లవ్ యు'

ప్రేమ‌క‌థా చిత్రాల‌ స్పెషలిస్ట్ ద‌ర్శ‌కుడు ఎ.కరుణాకరన్.. ప్రేమకథలను తనదైన శైలిలో వెండి తెరపై చూపడంలో నేర్పరి.