రజనీకాంత్‌, శంకర్‌ '2.0' ఆడియో, టీజర్ రిలీజ్ వివరాలు

  • IndiaGlitz, [Thursday,September 07 2017]

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్ళీ ఇదే కాంబినేషన్‌లో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం '2.0'. ఈ చిత్రాన్ని ఇండియన్‌ సినిమాలోనే భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో హాలీవుడ్‌ స్థాయిలో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ తమ మొదటి చిత్రంగా '2.0' నిర్మిస్తోంది.

ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ విలన్‌గా ఓ విభిన్నమైన పాత్ర పోషిస్తుండగా, ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. కాగా, ఈ చిత్రం ఆడియోను అక్టోబర్‌లో దుబాయ్‌లో విడుదల చేయనున్నారు. అలాగే నవంబర్‌లో టీజర్‌ను హైదరాబాద్‌లో రిలీజ్‌ చేస్తారు. డిసెంబర్‌లో ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను చెన్నైలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు లైకా ప్రొడక్షన్స్‌ క్రియేటివ్‌ హెడ్‌ రాజు మహాలింగం తెలిపారు. ఈ చిత్రాన్ని జనవరిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సరసన ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ విలన్‌గా ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో సుధాంశు పాండే, ఆదిల్‌ హుసేన్‌, కళాభవన్‌ షాజాన్‌, రియాజ్‌ ఖాన్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నిరవ్‌షా, సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, ఎడిటింగ్‌: ఆంటోని, సమర్పణ: సుభాష్‌ కరణ్‌, లైకా ప్రొడక్షన్స్‌ క్రియేటివ్‌ హెడ్‌: రాజు మహాలింగం, నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శంకర్‌.

More News

శ్రియకి రెండు అలాంటివే

బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' లో వశిష్టీదేవిగా మెప్పించింది అందాల నటి శ్రియ.

పవన్ డైరెక్టర్ కి ఛాలెంజింగ్ విషయం

పదహారేళ్ల క్రితం విడుదలై సంచలన విజయం అందుకున్న పవన్ కళ్యాణ్ 'ఖుషి'లో..

'మహానుభావుడు' కి ఆ పాటే హైలెట్ అట

యువ కథానాయకుడు శర్వానంద్,యూత్ ఫుల్ చిత్రాల దర్శకుడు మారుతి కాంబినేషన్లో

ఏడేళ్ల త‌రువాత‌..

సందీప్ చౌతా.. ఈ పేరు విన‌గానే 'నిన్నే పెళ్లాడుతా', 'ప్రేమ‌క‌థ‌', 'సూప‌ర్‌', 'బుజ్జిగాడు' లాంటి మ్యూజిక‌ల్ హిట్స్ గుర్తుకువ‌స్తాయి. ప‌రిమిత సంఖ్య‌లోనే సినిమాలు చేసిన‌ప్ప‌టికీ గుర్తుండిపోయే బాణీలు ఇచ్చిన సందీప్‌.. తెలుగులో చివ‌రిగా చేసిన చిత్రం 'కేడి'.

విజ‌య్ ఆంటోనితో అంజ‌లి

తెలుగమ్మాయి అంజ‌లి.. త‌మిళంలోనే ఎక్కువ‌గా సినిమాలు చేసిన సంగ‌తి తెలిసిందే. 'అంగాడి తెరు' (షాపింగ్ మాల్‌), 'ఎంగేయుం ఎప్పోదుం' 'జ‌ర్నీ), 'ఇరైవి' త‌దిత‌ర త‌మిళ‌ చిత్రాల‌తో అంజ‌లి మంచి న‌టిగా పేరు తెచ్చుకుంది.