చిరు సరసన రజనీ హీరోయిన్?

  • IndiaGlitz, [Tuesday,June 26 2018]

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, కిచ్చా సుదీప్, విజ‌య్ సేతుప‌తి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. నయనతార కథానాయికగా నటిస్తుండగా.. మిల్కీ బ్యూటీ తమన్నా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఇదిలా ఉంటే.. నరసింహారెడ్డి మొదటి భార్య పాత్రలో నయనతార నటిస్తుండగా.. మరో భార్య పాత్రలో బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషిని ఎంపిక చేసినట్టు సమాచారం. హిందీలో ‘గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్’ సిరీస్‌లతో పాటు ‘బద్లాపూర్’, ‘జాలీ ఎల్.ఎల్.బి2’ లాంటి పలు చిత్రాలతో పాటు.. తాజాగా విడుదలైన ‘కాలా’ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి నటించింది హ్యూమా ఖురేషి.

బాలీవుడ్‌లో ఆమెకున్న ప్ర‌త్యేక గుర్తింపుని దృష్టిలో పెట్టుకుని ఈ పాత్ర కోసం సంప్రదించినట్టు తెలుస్తోంది. దీనికి హ్యూమా కూడా అంగీకరించింద‌నీ.. త్వరలోనే షూటింగ్‌లో కూడా పాల్గొనబోతోంద‌ని అంటున్నారు. కొణిదెల ప్రొడక్షన్ పతాకంపై రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాని వచ్చే వేసవికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

More News

తేజ్ ఐ లవ్ యు ట్రైలర్ విడుదల

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు

'ఈ న‌గ‌రానికి ఏమైంది?' సెన్సార్ పూర్తి..

'పెళ్ళి చూపులు'తో గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు తరుణ్ భాస్కర్. ఆ సినిమా మంచి విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా.. ఉత్త‌మ ప్రాంతీయ చిత్రంగా జాతీయ స్థాయిలో అవార్డులు కూడా సొంతం చేసుకుంది.

నెల రోజుల గ్యాప్‌లో విక్ర‌మ్ చిత్రాలు

శివ‌పుత్రుడు, అప‌రిచితుడు చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైన త‌మిళ క‌థానాయ‌కుడు చియాన్ విక్ర‌మ్‌. ఆ సినిమాల త‌రువాత తెలుగులోనూ మంచి మార్కెట్‌ను సొంతం చేసుకున్నారు విక్ర‌మ్‌.

సంక్రాంతి కాదు.. వేస‌వి

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఈ ఏడాది వేస‌వికి భ‌ర‌త్ అనే నేను అంటూ ప‌ల‌క‌రించి మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు.

పొలిటిషియ‌న్‌గా సూర్య‌

వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల‌కు చిరునామాలా నిలిచిన క‌థానాయ‌కుడు సూర్య‌. త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపును, మార్కెట్‌ను సొంతం చేసుకున్న సూర్య‌.