ఏప్రిల్‌లో ప్రపంచ వ్యాప్తంగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ల '2.0'

  • IndiaGlitz, [Sunday,December 03 2017]

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్ళీ ఇదే కాంబినేషన్‌లో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న '2.0' చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టుగానే ఇండియన్‌ సినిమాలోనే 450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో హాలీవుడ్‌ స్థాయిలో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ విలన్‌గా ఓ విభిన్నమైన పాత్ర పోషిస్తుండగా, ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ శరవేగంగా జరుపుకుంటోంది.

ఈ చిత్రాన్ని 2018 ఏప్రిల్‌లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని లైకా ప్రొడక్షన్స్‌ క్రియేటివ్‌ హెడ్‌ రాజు మహాలింగం తెలియజేశారు.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సరసన ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ విలన్‌గా ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో సుధాంశు పాండే, ఆదిల్‌ హుసేన్‌, కళాభవన్‌ షాజాన్‌, రియాజ్‌ ఖాన్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నిరవ్‌షా, సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, ఎడిటింగ్‌: ఆంటోని, సమర్పణ: సుభాష్‌ కరణ్‌, లైకా ప్రొడక్షన్స్‌ క్రియేటివ్‌ హెడ్‌: రాజు మహాలింగం, నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శంకర్‌.

More News

ఆది పినిశెట్టి - తాప్సీ జంటగా కోన వెంకట్ సమర్పణలో నూతన చిత్రం !!

కోన వెంకట్ సమర్పణలో "గీతాంజలి" చిత్రాన్ని నిర్మించిన ఎం.వి.వి సినిమా మరియు కోన ఫిలిమ్ కార్పొరేషన్ సంస్థలు సంయుక్తంగా ఒక విభిన్నమైన కథతో నిర్మిస్తున్న నూతన చిత్రం డిసెంబర్ 21న ప్రారంభంకానుంది.

పాపులర్ స్టార్ సన్నీలియోన్ హీరోయిన్ గా తెలుగు చిత్రం

పలు ఆంగ్ల మరియు హిందీ చిత్రాల్లో నటిస్తూ తన క్రేజ్ ను దశదిసలా వ్యాపిస్తున్న మోస్ట్ పాపులర్ హాలీవుడ్ లేడీ సన్నీలియోన్ మొట్టమొదటిసారిగా తెలుగులో హీరోయిన్ గా ఒక సినిమా సైన్ చేసింది.

జ‌న‌వ‌రి నుంచి ర‌వితేజ‌, క‌ళ్యాణ్ కృష్ణ చిత్రం?

చాలా గ్యాప్ తర్వాత 'రాజా ది గ్రేట్' సినిమాతో మళ్ళీ ఫాంలోకి వచ్చారు రవితేజ. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సందడి చేయడంతో మంచి ఉత్సాహంలో ఉన్నారీ మాస్ మహారాజ్.

మాస్ పాత్ర‌లో స‌మంత‌

'ఏం మాయ చేసావే' సినిమాలో పక్కింటి అమ్మాయిలా కనిపించిన హీరోయిన్ సమంత. తొలి తెలుగు మూవీతోనే జెస్సిగా అందరి హృదయాలని గెలుచుకుంది. 2017 సమంత జీవితంలో చాలా స్పెషల్ అనే చెప్పాలి.

వీరభద్ర క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రం టైటిల్ ఖరారు

కొత్త న‌టుడు శ్రీకాంత్ హీరోగా, హేమ‌ల‌త (బుజ్జి) హీరోయిన్ గా  వీర‌భ‌ద్ర క్రియేష‌న్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రం ఇటీవలే ప్రారంభం అయింది  హేమ‌ల‌తా రెడ్డి నిర్మాత‌.