త‌లైవా 169 ఫిక్స్‌..!

త‌లైవా ర‌జినీకాంత్ రాజ‌కీయాల‌కు దూర‌మైన సంగ‌తి తెలిసిందే. ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో రాజ‌కీయాల‌కు తాను దూరం అనే విష‌యాన్ని ఆయ‌న ప్ర‌క‌టించేశాడు. దీంతో ఆయ‌న ఇక సినిమాల‌కే ప‌రిమితం కానున్నారు. ప్ర‌స్తుతం ర‌జినీకాంత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘అణ్ణాత్త‌’. అరవై శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ సినిమాకు సంబంధించి డైరెక్ట‌ర్ శివ‌.. త్వరలోనే చెన్నైలోనే కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 4న ‘అణ్ణాత్త‌’ సినిమాను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో మీనా, ఖుష్బూ, నయనతార, కీర్తి సురేశ్ తదితరులు నటిస్తున్నారు.

కోలీవుడ్ వ‌ర్గాల లేటెస్ట్ స‌మాచారం మేర‌కు, ర‌జినీకాంత్ 169వ చిత్రం కూడా ఖ‌రారైందట‌. 2019లో రజినీకాంత్‌తో ‘పేట’ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్, రజినీకాంత్ 169వ చిత్రాన్ని తెరకెక్కిస్తారట. సన్ పిక్చర్స్ బ్యానర్లోనే ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. అంతా సవ్యంగా జరిగితే 2022లో రజినీకాంత్ 169వ సినిమా ట్రాక్ ఎక్కుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

More News

బ్రేక్ తీసుకున్న బ‌న్నీ

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ రీసెంట్‌గా ‘పుష్ప‌’ సినిమాకు సంబంధించి రెండో షెడ్యూల్‌ను పూర్తి చేసిన సంగ‌తి తెలిసిందే.

‘పుష్ప’ లొకేష‌న్‌కు ‘ఆచార్య‌’..!

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య‌’. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఇందులో సిద్ధ అనే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు.

క్రేజీ కాంబినేష‌న్‌పై మైత్రీ మూవీస్ క‌న్ను...

పెళ్లిచూపులుతో హీరోగా సాలిడ్ హిట్ కొట్టి బ్రేక్ సాధించిన హీరో విజయ్ దేవరకొండ. తదుపరి చిత్రం అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు.

మెగా ఫ్యామిలీతో కీర‌వాణి సెంటిమెంట్‌..!

మెగాస్టార్‌.. ఆయ‌న న‌ట వార‌సులుగా ఇండ‌స్ట్రీలో చాలా మంది ప‌రిచ‌యం అయ్యారు. అయితే ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి

‘స‌లార్‌’ .. ప్ర‌శాంత్ నీల్ స్పీడు మామూలుగా లేదుగా..!

ప్ర‌భాస్ ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన త‌ర్వాత ఆయ‌న కోసం ద‌ర్శ‌క నిర్మాత‌లు క్యూ క‌డుతున్నారు.