విలన్‌గా రాజశేఖర్..

  • IndiaGlitz, [Wednesday,March 28 2018]

ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రకుల్‌ప్రీత్ సింగ్, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తారని వార్తలు వచ్చాయి. తాజాగా ‘ఛలో’ హీరోయిన్ రష్మిక మండన్న పేరు కూడా వినిపిస్తోంది. ఈ ముగ్గురిలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ సరసన నటించే హీరోయిన్లు ఎవరన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే డా. రాజశేఖర్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

రాజమౌళి సినిమాల్లో విలన్ క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. అలాంటి ఓ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో రాజశేఖర్ నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈమధ్యకాలంలో సరైన హిట్ లేని రాజశేఖర్‌కి ‘పిఎస్‌వి గరుడవేగ’తో సూపర్‌హిట్ వచ్చింది. రాజమౌళి సినిమాలో రాజశేఖర్ విలన్ అనే వార్త నిజమే అయితే అతనికిది శుభపరిణామంగానే చెప్పుకోవచ్చు. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని.. ఎన్టీఆర్, రామ్‌చరణ్ సోదరుల్లా నటిస్తారని సమాచారం. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో రూపొందే ఈ సినిమా వచ్చే సంవత్సరం విడుదలయ్యే అవకాశం ఉంది. 

More News

మెట్రో ట్రైన్ లో నాగార్జున, నాని

కింగ్ నాగార్జున - నేచురల్ స్టార్ నాని హీరోలుగా ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ పతాకం

బ‌న్నికిది మ‌ర‌చిపోలేని రోజు

మార్చి 28, 2003.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లో మ‌ర‌చిపోలేని రోజు ఇది.

వ‌ర్మ, అఖిల్ సినిమా క‌న్‌ఫ‌ర్మ్‌

రామ్‌గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో అక్కినేని అఖిల్ సినిమా ఉంటుంద‌ని కొన్ని రోజుల క్రితం వార్త‌లు విన‌ప‌డ్డ సంగ‌తి తెలిసిందే.

ఏప్రిల్ మొద‌టివారంలో సుమంత్ 24 ఫ‌స్ట్‌లుక్‌

'మ‌ళ్ళీరావా' చిత్రంతో మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్‌లోకి వ‌చ్చారు కథానాయకుడు సుమంత్.

'పంతం' తో గోపీచంద్ సందేశం

యాక్షన్ చిత్రాల క‌థానాయ‌కుడు గోపీచంద్, హ్యాట్రిక్ విజ‌యాల క‌థానాయిక‌ మెహరీన్ జంటగా నూతన దర్శకుడు కె.చ‌క్ర‌వ‌ర్తి (చ‌క్రి) తెరకెక్కిస్తున్న చిత్రం ‘పంతం’.