'రాజరథం' పోస్టర్ పవన్ కళ్యాణ్ సినిమా పోస్టర్ కి కాపీ కాదు. ఇది ఒరిజినల్

  • IndiaGlitz, [Wednesday,October 18 2017]

నిరూప్‌ భండారి, అవంతిక శెట్టి జంటగా తమిళ్‌ హీరో ఆర్య ప్రత్యేక పాత్రలో జాలీ హిట్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపొందుతున్న డిఫరెంట్‌ మూవీ 'రాజరథం'. 'రంగితరంగ' వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని రూపొందించిన అనూప్‌ భండారి దర్శకత్వంలో జాలీ హిట్స్‌ టీమ్‌ అజయ్ రెడ్డి గొల్లపల్లి, అంజు వల్లభనేని, విషు దకప్పదారి, సతీష్‌ శాస్త్రి, ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రంలోని ఆర్య ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల చేసింది 'రాజరథం' టీమ్‌. అయితే ఈ పోస్టర్‌ డిజైన్‌ పవన్‌కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న కొత్త చిత్రం నుంచి కాపీ చేయబడిందని మీడియాలో కొన్ని కథనాలు వచ్చాయి. దీనిపై 'రాజరథం' టీమ్‌ ఈ విధంగా స్పందించింది. ''ఈ వార్త ఎలా, ఎందుకు వచ్చిందో మాకు అర్థం కావడం లేదు. మేం అక్టోబర్‌ 12న ఈ పోస్టర్‌ను విడుదల చేశాం. మీడియాలో వచ్చిన న్యూస్‌లో 17న 'రాజరథం' పోస్టర్‌ వచ్చినట్టు పేర్కొన్నారు. కానీ, అది నిజం కాదు. ఎందుకంటే ఆ పోస్టర్‌లోని స్టిల్‌ను సెప్టెంబర్‌లో తియ్యడం జరిగింది. మా టీమ్‌కి టెక్నికల్‌గా వున్న బలంతో మేం క్రియేట్‌ చేసిన వర్క్‌ అది. మాకు తెలిసి వేరొకరి క్రియేటివిటీని మేం ఎక్కడా కాపీ చెయ్యలేదు. మేం రిలీజ్‌ చేసిన పోస్టర్‌ వెనుక ఎంతో మంది కష్టం, ఎంతో ప్లానింగ్‌ వుంది. కొన్ని నెలల క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీ బోర్డ్‌ రెడీ చెయ్యడం జరిగింది. మేం ఈ చిత్ర పోస్టర్ స్టిల్స్ కోసం హ్యాసల్‌బ్లాడ్‌ కెమెరాను వాడాం. ప్రముఖ బాలీవుడ్‌ కెమెరామెన్‌ మనీష్‌ ఠాకూర్‌ ఈ ఫోటోలను తీశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా మా దగ్గర వుంది. తెలుగు ప్రేక్షకులకు ఒక కొత్త తరహా అనుభూతిని కలిగించేందుకు మేం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మా దర్శకుడు అనూప్‌ భండారి, మా డిజైన్‌ టీమ్‌ 'కాని స్టూడియో' ఈ పోస్టర్‌ను మా తొలి తెలుగు చిత్రం 'రాజరథం' కోసం క్రియేట్‌ చేశారు. మాకు పవన్‌కళ్యాణ్‌గారంటే ఎంతో గౌరవం వుంది. వారిని, వారి టీమ్‌ని అగౌరవ పరచాలన్న ఉద్దేశం మాకు లేదు. మేం రిలీజ్‌ చేసిన పోస్టర్‌ కాపీ చేసింది కాదని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాం.

- 'రాజరథం' టీమ్

More News

చిన్మయి చేతుల మీదుగా దృష్టి టీజర్ లాంఛ్

అందాల రాక్షసి, అలా ఎలా సినిమాలతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న రాహుల్ రవీంద్రన్ కథానాయకుడిగా, ఎమ్ స్వేర్ బ్యానర్ పై రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దృష్టి.

క్రిస్మస్ కానుకగా నాని, సాయి పల్లవి ల 'ఎంసీఏ'

డబుల్ హ్యాట్రిక్ హీరో నేచురల్ స్టార్ నాని, హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్ లో రూపొందుతోన్నసినిమా `ఎంసీఏ`. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

శ్రీకారం చుట్టుకున్న'రుణం'

జీవితంలో ప్రతి మనిషి ఎవరికో ఒకరికి ఋణపడుతూ ఉంటాడు. అది గుర్తు పెట్టుకొని తీర్చేవాడు మనిషవుతాడు. అత్యాశ మనిషిని ఎంత దూరం అయినా తీసుకువెళ్తుంది. ఒక్కోసారి అది జీవితాన్ని గొప్ప స్థాయిలో నిలుపుతుంది.

24 డైరెక్టర్ తో ఎన్టీఆర్ ?

ఇటీవలే జైలవకుశలో త్రిపాత్రాభినయం చేసి మెప్పించాడు యంగ్టైగర్ ఎన్టీఆర్. ఇక మనం డైరెక్టర్ విక్రమ్ కుమార్ కూడా తన గత చిత్రం 24లో సూర్యని మూడు పాత్రల్లో చూపించి మంచి మార్కులు కొట్టేశాడు. అలాంటి ఎన్టీఆర్, విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

మహేష్.. మళ్లీ పవన్ డేట్ ?

శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత బ్రహ్మోత్సవం, స్పైడర్ చిత్రాలతో సందడి చేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అయితే ఆ రెండు సినిమాలు కూడా ఆశించిన విజయం సాధించలేదు.