హాట్ టాపిక్ గా మారిన రాజ‌మౌళి రెమ్యూన‌రేష‌న్

  • IndiaGlitz, [Thursday,August 04 2016]

ద‌ర్శ‌క‌ధీర రాజ‌మౌళి తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి. ఈ సంచ‌ల‌న చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు 600 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి చ‌రిత్ర సృష్టించింది. దీంతో బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. బాహుబ‌లి సాధించిన విజయం దృష్టిలో పెట్టుకుని బాహుబ‌లి 2 చిత్రాన్నిరాజ‌మౌళి మ‌రింత భారీ స్ధాయిలో తెర‌కెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే....బాహుబ‌లి 2 కు రాజ‌మౌళి తీసుకుంటున్న రెమ్యూన‌రేష‌న్ ప్ర‌జెంట్ హాట్ టాపిక్ అయ్యింది.

ఇంత‌కీ రాజ‌మౌళి ఎంత తీసుకుంటున్నాడు అంటే...బాహుబ‌లి 2 తెలుగు వెర్షెన్ కాకుండా మిగిలిన భాష‌ల్లో బాహుబ‌లి 2 చిత్రాన్ని ఎంత‌కు అమ్ముతారో అందులో స‌గం త‌న‌కు ఇవ్వాల‌ని రాజ‌మౌళి నిర్మాత‌ల‌తో ఒప్పందం కుదుర్చుకున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. త‌మిళ్, మ‌ల‌యాళం, హిందీ వెర్షెన్స్ క‌లిపి బాహుబ‌లి 2 చిత్రానికి 150 నుంచి 200 కోట్లు బిజినెస్ అయ్యే అవ‌కాశం ఉంది. ఈ లెక్క ప్ర‌కారం రాజ‌మౌళి రెమ్యూన‌రేష‌న్ దాదాపు 100 కోట్లు అని ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రి...ఈ ప్ర‌చారం పై రాజ‌మౌళి స్పందిస్తాడేమో చూడాలి.

More News

తొలిసారి చార్మినార్ ను సందర్శించిన స్టార్ హీరో..!

తొలిసారి చార్మినార్ ను సందర్శించిన స్టార్ హీరో ఎవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

ఈనెల‌ 12 న ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ ఆడియో రిలీజ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోన్న భారీ చిత్రం జనతా గ్యారేజ్ . ఎన్టీఆర్ సరసన స‌మంత‌, నిత్యా మీనన్ లు కథానాయికలు గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ప్రఖ్యాత మల‌యాళ నటుడు మోహన్ లాల్  ఒక ప్రధాన పాత్రను పోషిస్తున్నారు.

నిఖిల్ హీరోయిన్ పెళ్లి చేసుకోబోతుందట...!

ఇంతకీ పెళ్లి చేసుకోబోతున్న నిఖిల్ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా..?కలర్స్ స్వాతి.

చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే ఆడియో విడుదల

పవన్,సోనియా దీప్తి హీరో,హీరోయిన్లుగా పి.ఆర్.మూవీ మేకర్స్ బ్యానర్ పై సంతోష్ నెలంటి దర్శకత్వంలో సోని పవన్,రజిని గట్టు నిర్మించిన చిత్రం చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే.

కళాకారుడు బీకేఎస్ వర్మకు దర్శకేంద్రుడు చేతుల మీదుగా స్వర్ణకంకణాన్ని బహూకరించిన బ్రహ్మానందం

ఆయన పేరున్న నటుడు.తెలుగు చలనచిత్ర సీమలో హాస్యమనే సామ్రాజ్యాన్ని ఏలుతున్న మకుటంలేని మహాచక్రవర్తి.ఆయన వృత్తి నటన.