'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్‌పై రాజ‌మౌళి సందేహం?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం’(ఆర్ఆర్ఆర్‌). ఇందులో మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్.. గోండు వీరుడు కొమురంభీమ్ పాత్రలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ నటిస్తోన్న సంగ‌తి తెలిసిందే. రెండు నిజమైన చారిత్ర‌క పాత్రల క‌ల్పిత‌గాథే ఈ చిత్రం. రూ.400 కోట్ల‌తో డి.వి.వి.దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ జోడీగా బ్రిటీష్ భామ ఒలివియా మోరిస్ న‌టిస్తుండ‌గా రామ్‌చ‌ర‌ణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్ న‌టిస్తోంది.

ఈ సినిమాను 2020లో జూలై 30న విడుద‌ల చేయాల‌నుకున్నారు. అయితే మేకింగ్‌లో ప‌ర్‌ఫెక్ష‌న్ కోసం వచ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 8న విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అయితే కరోనా ప్ర‌భావంతో ఇప్పుడు షూటింగ్ ఆగింది. లాక్‌డౌన్ కొన‌సాగుతూనే ఉంది. దీంతో రిలీజ్ డేట్‌పై రాజ‌మౌళి సందేహాన్ని వ్య‌క్తం చేశారు. ఇప్పుడు సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతి 8న విడుద‌ల కావ‌డం డౌటేన‌న్నారు. త‌దుప‌రి రిలీజ్ డేట్ ఇప్పుడే చెప్ప‌లేన‌ని కూడా ఆయ‌న చెప్పేశారు. దీంతో ఆర్ఆర్ఆర్ విడుద‌ల మ‌రోసారి వాయిదా ప‌డ‌ట్టే.

More News

చైత‌న్య నెక్ట్స్ ఆ ద‌ర్శ‌కుడితోనేనా..?

అక్కినేని నాగ‌చైత‌న్య సెన్సిటివ్ స‌బ్జెక్ట్స్‌ను డీల్ చేసే డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ‘ల‌వ్‌స్టోరి’ సినిమాలో న‌టిస్తున్నాడు. సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తుంది.

మహేశ్ లవ్‌స్టోరీ.. మ్యూజిక్ ఎవ‌రంటే?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 27వ సినిమాకు సంబంధించిన కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా

శ్రియ‌పై సిల్లీ కామెంట్స్‌.. ఆమె భ‌ర్త ఏమ‌న్నాడంటే..?

తెలుగు, త‌మిళ‌, హిందీ చిత్రాల్లో హీరోయిన్‌గా ఓ ఊపు ఊపిన శ్రియ ఇప్పుడు త‌న ల‌వ‌ర్ అండ్రూ కొచ్చిన్‌ను పెళ్లి చేసుకుని సెటిలైంది. వీరిద్ద‌రూ స్పెయిన‌ల్‌లో క్వారంటైన్ టైమ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

అప్పుడు.. ఇప్పుడు బన్నీ!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప‌’. భారీ బ‌డ్జెట్‌తో తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో సినిమా పాన్ ఇండియా చిత్రంగా విడుద‌ల‌వుతుంది.

ఎన్టీఆర్‌ డ‌బుల్ ట్రీట్ ఇస్తాడా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పుట్టిన‌రోజు మే 20. ఈ రోజున ఎన్టీఆర్ అభిమానులకు డ‌బుల్ ట్రీట్ ఇస్తాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.