సాంగ్స్ ప్లానింగ్‌లో ద‌ర్శ‌కధీరుడు

  • IndiaGlitz, [Saturday,November 23 2019]

టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్ 'ఆర్ ఆర్ ఆర్‌'. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రం కొమురం భీమ్‌, అల్లూరి సీతారామరాజుల‌కు సంబంధించిన క‌ల్పిత‌గాథ‌. 1920కి చెందిన ఈ పోరాట యోధులు చ‌రిత్ర‌లో ఎప్పుడూ క‌లుసుకోలేదు. అయితే వీరిద్ద‌రూ క‌లుసుకుని ఒక‌రికొక‌రు ఇన్‌స్పిరేష‌న్‌గా నిలిచి ఉంటే ఎలా ఉంటుంద‌నే క‌ల్పిత‌గాథ‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు జ‌క్క‌న్న. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా న‌టిస్తుంటే మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర‌లో న‌టిస్తున్నాడు.

డి.వి.వి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వి.దాన‌య్య రూ.350 కోట్ల సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు డెబ్బై శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్ర‌స్తుతం శ‌ర వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. వ‌చ్చే ఏడాది జూలై 30న విడుద‌ల అని అన్నారు కానీ.. రీసెంట్‌గా విడుద‌ల చేసిన అధికారిక ప్రెస్‌నోట్‌లో రిలీజ్ డేట్ గురించి ఎక్క‌డాద ప్ర‌స్తావించ‌లేదు. కాగా.. లేటెస్ట్ స‌మాచారం ఈ చిత్రంలో పాట‌ల చిత్రీక‌ర‌ణు రాజ‌మౌళి ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. అందులో ఓ సాంగ్ ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌ల‌పై ఉంటుంది. అలాగే మ‌రో రొమాంటిక్ సాంగ్ రామ్‌చ‌ర‌ణ్‌, ఆలియా భ‌ట్‌ల‌పై ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. ఎన్టీఆర్ స‌ర‌స‌న బ్రిటీష్ భామ ఓలివియా మోరిస్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌నున్నాయి. అజ‌య్ దేవ‌గ‌ణ్, స‌ముద్ర‌ఖ‌ని కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

More News

వినాయ‌క్ హీరోయిన్ వార్త‌ల వెనుక సీక్రెట్ ఏంటి?

ప‌లువ‌రు స్టార్ హీరోల‌ను డైరెక్ట‌ర్ చేసి స్టార్ డైరెక్ట‌ర్ లిస్టులో చేరిన వి.వి.వినాయ‌క్‌కి మ‌రో సినిమా చేయ‌డానికి చాలా గ్యాపే వ‌చ్చింది.

విజ‌య‌శాంతి రీ ఎంట్రీ అందుకే ఆల‌స్య‌మైందా?

లేడీ అమితాబ్‌, రాముల‌మ్మ దాదాపు 13 ఏళ్ల త‌ర్వాత వెండితెర‌పై క‌న‌ప‌డ‌బోతున్నారు.

మా 'జార్జ్ రెడ్డి' యూత్ కి కనెక్ట్ అయ్యాడు - దర్శకుడు జీవన్ రెడ్డి,సినిమాటోగ్రాఫర్ సుధాకర్ యక్కంటి

విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన జార్జిరెడ్డ ఈ శుక్రవారం (22న) విడుదలయి సూపర్ హిట్ టాక్ ని సొంత చేసుకుంది.

సంపత్ శ్రీను దర్శకత్వంలో శ్రీను.కె నిర్మాతగా ప్రొడక్షన్ 2 ప్రారంభం

ఎస్ పి క్రియేషన్స్ సమర్పణలో యస్.యస్.సి క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్2గా సంపత్ శ్రీను దర్శకత్వంలో

నిత్యానంద ఆశ్రమంలో బాలికలకు టార్చర్... వీడియోలు చేయాలంటూ హింసించిన వైనం

వివాదాస్పద గురువు నిత్యానంద మరోసారి వార్తల్లోకెక్కారు. మైనర్ బాలికలను అక్రమంగా నిర్బంధించి వేధిస్తున్నారని