రాజమండ్రిలో ఆది, వీరభద్రమ్ ల 'చుట్టాలబ్బాయి'

  • IndiaGlitz, [Sunday,February 28 2016]

లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది హీరోగా శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్‌, ఎస్‌.ఆర్‌.టి. మూవీ హౌస్‌ పతాకాలపై వీరభద్రమ్‌ దర్శకత్వంలో రాము తాళ్ళూరి, వెంకట్‌ తలారి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'చుట్టాలబ్బాయి'. ఈ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూల్‌ మార్చి 1 నుంచి రాజమండ్రిలో ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా నిర్మాతలు రాము తాళ్ళూరి, వెంకట్‌ తలారి మాట్లాడుతూ - ''ఇటీవల మా చిత్రంలోని ఇంట్రడక్షన్‌ సాంగ్‌ని బ్యాంకాక్‌లో శేఖర్‌ మాస్టర్‌ సారధ్యంలో 5 రోజులపాటు చిత్రీకరించడం జరిగింది. ఇప్పుడు మార్చి 1 నుంచి తాజా షెడ్యూల్‌ రాజమండ్రిలో ప్రారంభమవుతోంది. మార్చి 20 వరకు ఈ షెడ్యూల్‌ కొనసాగుతుంది'' అన్నారు.
దర్శకుడు వీరభద్రమ్‌ మాట్లాడుతూ - ''మార్చి 1 నుంచి జరిగే తాజా షెడ్యూల్‌ను రాజమండ్రి, గోదావరి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించడం జరుగుతుంది. ఆది, నమిత ప్రమోద్‌ మరియు విలన్‌ పాల్గొనే ముఖ్యమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరిస్తాం. ఈ షెడ్యూల్‌లో ఒక పాటను, ఫైట్‌ను కూడా షూట్‌ చెయ్యబోతున్నాం. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం కోసం థమన్‌ చాలా ఎక్స్‌ట్రార్డినరీ ట్యూన్స్‌ ఇచ్చాడు. ఈ సినిమా తప్పకుండా నాకు, ఆదికి మంచి సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది'' అన్నారు.
లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది, నమిత ప్రమోద్‌, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, పృథ్వి, రఘుబాబు, కృష్ణభగవాన్‌, అభిమన్యు సింగ్‌, జీవా, సురేఖావాణి, షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర, రచ్చ రవి, గిరిధర్‌, అనితనాథ్‌ దితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్‌, సినిమాటోగ్రఫీ: ఎస్‌.అరుణ్‌కుమార్‌, ఆర్ట్‌: నాగేంద్ర, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, మాటలు: భవాని ప్రసాద్‌, స్టిల్స్‌: గుణకర్‌, నిర్మాతలు: రాము తాళ్ళూరి, వెంకట్‌ తలారి, కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: వీరభద్రమ్‌.

More News

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న నయనతార తాజా చిత్రం!!

ఈ చిత్రం భయపెట్టేటట్లుగా సమీప భవిష్యత్తులో మరే చిత్రం భయపెట్టలేదేమో.ఈ చిత్రం తర్వాత మరో హారర్ సినిమా నేను వెంటనే చేయకపోవచ్చు" అంటోంది

దేనికైనా రెడీ అంటున్న రేష్మి...

అనసూయ తర్వాత జబర్ధస్త్ యాంకర్ గా బుల్లితెరపై బాగా పాపులర్ అయిన యాంకర్ రేష్మి.

చరణ్ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి...

రాంచరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తమిళంలో విజయవంతమైన 'తనీఒరువన్ ' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్న పవన్ టార్గెట్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషన్ సర్ధార్ గబ్బర్ సింగ్. ఈ సినిమాని అనుకున్న విధంగా ఏప్రిల్ 8న రిలీజ్ చేయడానికి పవన్ 3 యూనిట్లుతో షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం సర్ధార్ రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జరుపుకుంటుంది.

అన్నమయ్య కాంబినేషన్లో ఓం నమో వెంకటేశాయ..

నాగార్జున - రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపొందిన అధ్యాత్మిక అద్భుతం అన్నమయ్య. తెలుగు చలనచిత్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సంచలన చిత్రంగా అన్నమయ్య నిలిచిన విషయం తెలిసిందే.