సాయథరమ్ తేజ్ ప్లేస్ లో రాజ్ తరుణ్...

  • IndiaGlitz, [Monday,February 08 2016]

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిథ‌ర‌మ్ తేజ్ ప్లేస్ లో..రాజ్ త‌రుణ్.. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే...సాయిథ‌ర‌మ్ తేజ్ హీరోగా వేగేశ్న స‌తీష్ శ‌త‌మానం భ‌వ‌తి అనే సినిమాని తెర‌కెక్కించాల‌నుకున్నారు. అయితే ఇప్పుడు సాయిథ‌ర‌మ్ తేజ్ ప్లేస్ లో హ్యాట్రిక్ హీరో రాజ్ త‌రుణ్ వ‌చ్చారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో నిర్మించ‌నున్నారు. ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మామ‌, కుమారి 21 ఎఫ్..చిత్రాల‌తో హ్యాట్రిక్ సాధించిన రాజ్ త‌రుణ్ న‌టించిన తాజా చిత్రం సీత‌మ్మ అందాలు రామ‌య్య సిత్రాలు ఇటీవ‌ల రిలీజైంది. ఈ సినిమా ఆశించిన విజ‌యాన్ని సాధించ‌లేక‌పోయినా రాజ్ త‌రుణ్ వ‌రుస ఆఫ‌ర్స్ ద‌క్కించుకుంటుండ‌డం విశేషం. రాజ్ త‌రుణ్ - వేగేశ్న స‌తీష్ కాంబినేష‌న్లో రూపొందే శ‌త‌మానం భ‌వ‌తి త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ల‌నుంది.

More News

'శ్రీశ్రీ' డబ్బింగ్ కంప్లీట్...

సూపర్ స్టార్ కృష్ణ,విజయనిర్మల,సీనియర్ నరేష్ ప్రధాన పాత్రధారులుగా ఎస్ బి ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ముప్పలనేని శివ దర్శకత్వంలో

సర్ధార్ సరికొత్త రికార్డ్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్.

ట్రైలర్ విడుదల చేస్తున్న మహేష్, సమంత...

పివిపి సంస్థ బ్యానర్ ఫై అడివిశేష్,ఆదాశర్మ హీరో హీరోయిన్లుగా అనసూయ ప్రధానపాత్రలో రూపొందుతోన్న చిత్రం క్షణం.

సరైనోడు తర్వాత బన్ని సినిమా ఇదే...

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం సరైనోడు.ఈ చిత్రాన్ని బోయపాటి తెరకెక్కిస్తున్నారు.గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తనపేరుపై జరుగుతున్న మోసానికి నారారోహిత్ వివరణ

ఈ మధ్య తాటికొండ సాయికృష్ణ అనే వ్యక్తి నా పేరు చెప్పి సినిమా తీస్తానని అంటూ కొంత మంది వ్యక్తుల నుండి డబ్బులు వసూలు చేసిన విషయం నా దృష్టికి వచ్చింది.