కొత్త దర్శకుడితో రాజ్ తరుణ్...

  • IndiaGlitz, [Monday,February 29 2016]

ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తమావ, కుమారి 21 ఎఫ్ చిత్రాలతో హ్యట్రిక్ విజయాలను సాధించిన రాజ్ తరుణ్ ఇప్పుడు వరుస సినిమాలను చేస్తున్నాడు. మంచు విష్ణు హీరోగా, నిర్మాతగా రూపొందుతోన్న చిత్రంలో నటిస్తుండగా, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నాడు. ఈ చిత్రాలు కాకుండా త్వరలోనే ఓ నూతన దర్శకుడి చిత్రంలో నటించబోతున్నాడట. గతంలో పలు చిత్రాలకు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో వర్క్ చేసిన నాని చెప్పిన కథ నచ్చడంతో రాజ్ తరుణ్ ఆ సినిమాలో నటించడానికి ఎస్ చెప్పాడట. త్వరలోనే సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు తెలిసే అవకాశం ఉందని సమాచారం.