విజ‌య‌వాడ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నా: రాజ్ త‌రుణ్

  • IndiaGlitz, [Friday,June 14 2019]

రీసెంట్‌గా సోష‌ల్ మీడియా చాట్‌లో తాను ప్రేమ వివాహం చేసుకుంటున్నాన‌ని, త్వ‌ర‌లోనే త‌న పెళ్లి క‌బురు చెబుతాన‌ని హీరో రాజ్‌త‌రుణ్ తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ ''నేను ప్రేమిస్తున్న అమ్మాయిది విజ‌య‌వాడ‌. ఇద్ద‌రం ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. త‌ను వ్యాపారవేత్త‌. తెలుగు అమ్మాయే. ఇప్పుడే అంద‌రి దృష్టిలో ప‌డ‌టం త‌న‌కు ఇష్టం లేదు. త‌న అభిప్రాయాల‌పై ఉన్న గౌర‌వంతో ఆమె పేరు చెప్పాల‌నుకోవ‌డం లేదు.

మా ఇరు కుటుంబాల పెద్ద‌లు పెళ్లికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. నేను పెళ్లికి సిద్ధంగానే ఉన్నా.. వ‌చ్చే ఏడాదే పెళ్లి చేసుకోవాల‌నుకుంటున్నాం. ఆరేళ్ల క్రితం వైజాగ్‌లో జ‌రిగిన నా పుట్టిన‌రోజు వేడుక‌ల్లో ఆమెను క‌లిశాను. అలా ఇద్ద‌రి ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది. ఇద్ద‌రి అభిరుచులు క‌లిశాయి. ఇద్ద‌రం ఒక‌రికొక‌రు అనే ఫీలింగ్‌లో ఉన్నాం. ఇక ప్రొఫెష‌న‌ల్‌గా నా ప‌నెంటో ఆమెకు తెలుసు. ఆమెకు నాపై న‌మ్మ‌కం ఉంది'' అన్నారు.

More News

సూప‌ర్‌స్టార్‌తో న‌టించాల‌నుందంటున్న హాలీవుడ్ యాక్ట‌ర్‌

ఇటీవ‌ల మ‌హ‌ర్షి విడుద‌లైన‌ప్పుడు ఆ సినిమాను ఆకాశానికెత్తేస్తూ.. మహేష్‌, వంశీ పైడిప‌ల్లి అమెరికా వ‌స్తే త‌న‌ను క‌ల‌వాలంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా పోస్ట్ చేశారు హాలీవుడ్ యాక్ట‌ర్ బిల్ డ్యూక్‌.

టీడీపీకి పట్టిన గతే టీఆర్ఎస్‌కు.. అందుకే జగన్‌తో స్నేహం!

2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ ఓటమిపై ఇప్పటికీ ఎంత వెతికినా కారణాలు మాత్రం తెలియట్లేదు.

మాల్దీవ్స్‌లో పాట చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న 'ఇస్మార్ట్ శంక‌ర్‌'

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేశ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం `ఇస్మార్ట్ శంకర్‌`.

2024లో జగన్‌పై గెలిచేందుకు ‘పీకే’తో టీడీపీ డీల్!

టైటిల్ చూడగానే కాసింత ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ.. అవును మీరు వింటున్నది నిజమే.. 2019 ఎన్నికల్లో వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్..

చంద్రబాబుకే అర్థంకాక తలపట్టుకున్నారట..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కనివినీ ఎరుగని రీతిలో వైసీపీ విజయ దుందుభి మోగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.