ఏప్రిల్ 18 నుంచి రాజ్ త‌రుణ్ కొత్త చిత్రం

  • IndiaGlitz, [Sunday,March 25 2018]

'ఉయ్యాలా జంపాలా', 'సినిమా చూపిస్త మావ', 'కుమారి 21ఎఫ్' సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నారు యువ క‌థానాయ‌కుడు రాజ్ తరుణ్. చిన్న సినిమాలతో పెద్ద విజయాలను అందుకున్న ఈ యంగ్‌ హీరో.. పలు దర్శక నిర్మాతల దృష్టిలో పడ్డారు.

అయితే గత కొంత కాలంగా విజయాలకు దూరమయ్యారు రాజ్ త‌రుణ్‌. ఈ ఏడాది మాత్రం వరుస సినిమాలు చేస్తున్న నేపథ్యంలో.. తప్పకుండా విజయం సాధిస్తాన‌న్న‌ ధీమాతో ఉన్నారు రాజ్ తరుణ్.

ఈ క్రమంలో 'కుమారి 21 ఎఫ్' తో విజయాన్ని అందించిన పల్నాటి సూర్య ప్రతాప్‌తో మరో సినిమాను చేయబోతున్నారు ఈ యువ హీరో. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 18 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.

రవితేజ 'నేల టికెట్టు' సినిమాను నిర్మిస్తున్న రామ్ తాళ్లూరి.. ఎస్ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను కూడా నిర్మిస్తున్నారు. కథానాయికతో పాటు మిగిలిన టీమ్‌ సభ్యుల వివరాలను కూడా త్వరలోనే వెల్లడించనున్నారు.

ఇదిలా ఉంటే.. రాజ్‌త‌రుణ్ న‌టించిన 'రాజుగాడు' మే 11న విడుద‌ల అవుతుండ‌గా.. జూన్ 14న 'ల‌వ‌ర్' మూవీ రిలీజ్ కానుంది.

More News

మే నెల‌లో మారుతి, చైత‌న్య మూవీ ఫ‌స్ట్‌లుక్‌

అక్కినేని నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న చిత్రం 'శైలజా రెడ్డి అల్లుడు' (ప్ర‌చారంలో ఉన్న పేరు).

ఆది, అడివి సాయికిరణ్ సినిమా అప్‌డేట్‌

'ప్రేమకావాలి', 'లవ్లీ' సినిమాలతో వ‌రుస విజయాలను సొంతం చేసుకున్న యువ క‌థానాయ‌కుడు ఆది. గత కొంత కాలంగా విజయాలకు దూరమైన ఈ యంగ్ హీరో..

చిరు సినిమా పై స్పందించిన సుకుమార్‌

గత కొంతకాలంగా మెగాస్టార్ చిరంజీవి, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో సినిమా రాబోతుందంటూ గ‌త కొంత కాలంగా మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి.

విశాఖపట్నంలో వైభవంగా 'కిరాక్ పార్టీ' సక్సెస్ సెలబ్రేషన్స్ !!

నిఖిల్, సిమ్రాన్, సంయుక్త హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'కిరాక్ పార్టీ'. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు.

'నీది నాది ఒకే కథ' లాంటి గొప్ప చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన దర్శక నిర్మాతలకు హ్యాట్సాఫ్‌ - ప్రముఖ దర్శకులు

'అప్పట్లో ఒకడుండేవాడు'లాంటి డిఫరెంట్‌ చిత్రాన్ని నిర్మించిన ఆరాన్‌ మీడియా వర్క్స్‌ సంస్థ లేటెస్ట్‌గా 'నీది నాది ఒకే కథ' వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారు.