రాజ్ తరుణ్ న్యూమూవీ డీటైల్స్..

  • IndiaGlitz, [Monday,June 20 2016]

ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మావ‌, కుమారి 21 ఎఫ్...చిత్రాల‌తో హ్యాట్రిక్ సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన యువ హీరో రాజ్ త‌రుణ్. ఇటీవ‌ల ఈడోర‌కం ఆడోర‌కం చిత్రంతో మ‌రో స‌క్సెస్ సాధించిన రాజ్ త‌రుణ్ న‌టించ‌నున్న కొత్త సినిమా ఈనెల‌లో ప్రారంభం కానుంది. ఈ చిత్రం ద్వారా రిపోర్ట‌ర్ సంజ‌న రెడ్డి ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌యం కాబోతుంది. యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి మారుతి క‌థ - స్ర్కీన్ ప్లే అందిస్తున్న‌ట్టు స‌మాచారం.
ఈ చిత్రంలో రాజ్ త‌రుణ్ స‌ర‌స‌న జెంటిల్ మ‌న్ ఫేం నివేథ థామ‌స్ హీరోయిన్ న‌టించ‌నుంది. ఈ యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ ని ఎ.కె. ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై అనిల్ సుంక‌ర నిర్మిస్తున్నారు. అయితే...ఈ చిత్రాన్ని ముందుగా త‌రుణ్ బ‌డిరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించాల‌నుకున్నారు. కానీ కుద‌ర‌లేదు. ఆత‌ర్వాత సాయి గోకుల్ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించాల‌నుకున్నారు సెట్ కాలేదు. ఫైన‌ల్ గా రాజ్ త‌రుణ్ హీరోగా సంజ‌న రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందే ఈ మూవీ స‌క్సెస్ సాధించాల‌ని ఆశిస్తూ.. ఆల్ ది బెస్ట్ టు రాజ్ త‌రుణ్ & సంజ‌న రెడ్డి.