మెగా కాంపౌండ్ లోకి యంగ్ హీరో..

  • IndiaGlitz, [Tuesday,August 25 2015]

ఉయ్యాలా జంపాలా', సినిమా చూపిస్త మావ' వంటి రెండు వరుస విజయాలతో ప్రస్తుతం రాజ్ తరుణ్ ట్రెండ్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం చిన్న చిత్రాలను నిర్మించాలనుకుంటున్న నిర్మాతలందరూ రాజ్ తరుణ్ వెనుకపడుతున్నారు. అయితే రాజ్ తరుణ్ అచితూచి వ్యవహరిస్తున్నాడు.

తాజాసమాచారం ప్రకారం భలే భలే మగాడివోయ్' చిత్రాన్ని నిర్మించిన అల్లుఅరవింద్ సంస్థ గీతాఆర్ట్స్2 బ్యానర్ లో ఓ సినిమా చేయనున్నాడట. ఈ చిత్రానికి మున్నా అనే దర్శకుడు పనిచేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ లోకి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని బన్నివాసు, మారుతి కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారని సమాచారం.అధికారకంగా సమాచారం వెలువడాల్సి ఉంది.