రెండు ప్రాజెక్ట్ లను ఎనౌన్స్ చేసిన రాజ్ తరుణ్....

  • IndiaGlitz, [Thursday,June 02 2016]

ఉయ్యాలా జంపాల‌, సినిమా చూపిస్త మావ‌, కుమారి 21 ఎఫ్...చిత్రాల‌తో హ్యాట్రిక్ సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన యువ హీరో రాజ్ త‌రుణ్. తాజాగా హీరో విష్ణుతో క‌లిసి న‌టించిన చిత్రం ఈడోర‌కం ఆడోర‌కం. మంచి విజ‌యాన్ని సాధించిన‌ ఈ చిత్రం అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో నేటికి విజ‌య‌వంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా హీరో రాజ్ త‌రుణ్ ట్విట్ట‌ర్ లో త‌న సంతోషాన్ని పంచుకున్నారు. అంతే కాకుండా త‌న త‌దుప‌రి చిత్రాల‌ను కూడా ఎనౌన్స్ చేసాడు. ఎ.కె ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ లో ఓ చిత్రం, డైరెక్ట‌ర్ మారుతి, ఎ.కె ఎంట‌ర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించే మ‌రో చిత్రంలో న‌టిస్తున్నాను. త్వ‌ర‌లోనే ఈ రెండు చిత్రాల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను తెలియ‌చేస్తాను అని హీరో రాజ్ త‌రుణ్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు.