కొత్త సంవత్సరం రోజున రాధేశ్యామ్ టీజర్.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

  • IndiaGlitz, [Wednesday,December 30 2020]

రెబల్‌స్టార్ ప్ర‌భాస్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘రాధేశ్యామ్’. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుద‌ల‌వుతుందా? అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. చిన్నా చిత‌కా అప్‌డేట్స్ మిన‌హా ఈ సినిమాకు సంబంధించి మేజ‌ర్ అప్‌డేట్ లేద‌ని అభిమానులు బాధ‌ప‌డుతున్నారు. అయితే అభిమానుల కోరిక తీర్చ‌డానికి ప్ర‌భాస్ సిద్ధ‌మ‌య్యారు. కొత్త సంవ‌త్స‌రం రోజున రాధేశ్యామ్ నుండి టీజ‌ర్ వ‌స్తుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

కాగా.. దీంతో పాటు మ‌రో వార్త కూడా సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. అదేంటంటే.. రాధేశ్యామ్ విడుల‌కు సంబంధించి. సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు రాధేశ్యామ్ విడుద‌ల ముందు జూన్‌లో ఉండే అవ‌కాశాలున్నాయ‌ని అన్నారు. కానీ తాజా స‌మాచారం మేర‌కు సినిమా విడుద‌ల ఇంకాస్త ముందుకు వ‌చ్చింది.మార్చి 30న రాధేశ్యామ్‌ను తెలుగు, హిందీ, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ట‌.

పీరియాడిక్ ల‌వ్‌స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుంది. ప్ర‌స్తుతం షూటింగ్ హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోలో జ‌రుగుతోంది. షూటింగ్ కూడా ఫైన‌ల్ ద‌శ‌కు చేరుకుంది. సంక్రాంతి లోపు ‘రాధేశ్యామ్‌’

ఈ సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ త‌దుప‌రి చిత్రంగా ‘స‌లార్‌’ షూటింగ్‌ను జ‌న‌వ‌రి 18 నుంచి స్టార్ట్ చేయ‌డానికి రెడీ అయ్యాడని టాక్ వినిపిస్తోంది.

More News

చెర్రీ ఆరోగ్యంపై ఉపాసన ట్వీట్..

మెగా ఫ్యామిలీని కరోనా మహమ్మారి హడలెత్తిస్తోంది. ఒకేరోజు మెగా ఫ్యామిలీకి చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.

మార్పు.. యూటర్న్‌లు.. న్యూ ఇయర్‌లో కేసీఆర్ 2.0..

2020 ఎండింగ్ తెలంగాణ సీఎం కేసీఆర్‌లో ఊహించని మార్పు తీసుకొచ్చింది. ఆ మార్పు ఎందుకు..? ఏమిటి? అని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.

భారత్‌లో పెరుగుతున్న యూకే స్ట్రెయిన్ కేసులు..

భారత్‌లో యూకే కరోనా వైరస్ స్ట్రెయిన్ కల్లోలం రేపుతోంది. ఆరు కేసులతో మొదలైన కరోనా కొ్త్త స్ట్రెయిన్..

అమెరికాలో టీఆర్ఎస్ అధికార ప్రతినిధి హత్య..

అమెరికాలో ప్రముఖ ఎన్ఆర్ఐ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. టీఆర్ఎస్ అధికార ప్రతినిధిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్లు టెర్రరిస్ట్‌లతో సమానం: సీపీ సజ్జనార్

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మద్యం సేవించి డ్రైవింగ్ చేసే వారి విషయమై సంచలన వ్యాఖ్యలు చేశారు.