‘రాధేశ్యామ్’ ప్లానింగ్ అలా చేశారా?

  • IndiaGlitz, [Monday,August 17 2020]

యంగ్ రెబల్‌స్టార్ ప్ర‌భాస్ ప్యాన్ ఇండియా అయిన‌ప్ప‌టి నుండి ఆయ‌న సినిమాల‌పై చాలా ఫోక‌స్ పెరిగింది. అభిమానులు ఆస‌క్తిక‌రంగా ప్ర‌భాస్ సినిమాల అప్‌డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్ర‌భాస్ కూడా అభిమానుల‌ను దృష్టిలో పెట్టుకుని సినిమాల‌ను ఓకే చేస్తూ వ‌స్తున్నారు. ప్ర‌భాస్ సినిమాల‌న్నీ ఇప్పుడు ప్యాన్ ఇండియా మూవీస్‌గానే తెర‌కెక్కుతున్నాయి. తాజాగా ప్ర‌భాస్ 20వ చిత్రం రాధేశ్యామ్ తుది ద‌శ చిత్రీక‌ర‌ణ‌కు చేరుకుంది. క‌రోనా వైర‌స్ ప్ర‌భావంగా ఈ సినిమా షూటింగ్ ఆగింది. మ‌రి ఎప్పుడు మొద‌ల‌వుతుందా? అని అందరూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్ర‌భాస్ కోసం హైద‌రాబాద్‌లో సెట్స్ వేశార‌ని.. విదేశాల‌కు ప్ర‌భాస్ షూటింగ్ కోసం వెళుతున్నార‌ని వార్త‌లు వినిపించాయి. ఆగ‌స్ట్‌లో సినిమా షూటింగ్ మొద‌లు పెట్టాల‌ని యూనిట్ భావించింది. కానీ.. ప‌రిస్థితులు స‌హ‌క‌రించ‌డం లేదు. దీంతో ద‌ర్శ‌క నిర్మాత‌లు సెప్టెంబ‌ర్‌లో షెడ్యూల్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లోనే విడుద‌ల చేయాల‌నుకుంటున్నారు. ఈ పీరియాడిక్ ల‌వ్‌స్టోరిలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుంది. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని గోపీకృష్ణామూవీస్‌, యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌ నిర్మిస్తున్నాయి.

More News

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురు

ఏపీ ప్రభుత్వానికి కోర్టులు కలిసి వస్తున్నట్టు లేదు. దాదాపు ప్రతి కేసులోనూ ఏపీ ప్రభుత్వానికి అపజయమే ఎదురవుతోంది.

‘దృశ్యం’ దర్శకుడు మృతి అంటూ పుకార్లు.. మాధవన్ సహా సంతాపం..

హిందీ ‘దృశ్యం’ దర్శకుడు నిషికాంత్ కామత్ మృతి చెందారంటూ ఆయన సన్నిహితుడు చెప్పిన మాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

సంప‌త్‌నంది క‌థ స్క్రీన్ ప్లే డైలాగ్స్‌తో కె.కె.రాధామోహ‌న్ కొత్త చిత్రం

ఏమైంది ఈవేళ‌, బెంగాల్ టైగ‌ర్ వంటి సూప‌ర్‌హిట్స్ అందించిన శ్రీ‌స‌త్య‌సాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహ‌న్ ప్రొడ‌క్ష‌న్ నెం.9గా

తెలంగాణలో కరోనా నుంచి కాస్త ఊరట.. తాజాగా ఎన్నంటే..

తెలంగాణ కరోనా హెల్త్ బులిటెన్‌ను సోమవారం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

పార్లమెంట్ అనెక్స్ భవనంలో చెలరేగిన మంటలు..

పార్లమెంట్ అనెక్స్ భవనంలో సోమవారం ఉదయం మంటలు చెలరేగాయి.