సూపర్ మార్కెట్‌లోకి నో ఎంట్రీ.. రాచకొండ సీపీ వార్నింగ్

  • IndiaGlitz, [Saturday,April 11 2020]

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో హైదరాబాద్‌లోని కొన్ని సూపర్ మార్కెట్ల యాజమాన్యాలు అతి చేస్తున్నాయి. లాక్‌డౌన్‌ అదనుగా చేసుకుని గట్టిగా వెనకేసుకోవడంతో పాటు.. ఎవరైనా విదేశీయులుగా అనుమానం వస్తే వారిపట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా నగరంలోని వనస్థలిపురంలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. చూడ్డానికి చైనీయుల్లా కనిపించడంతో మార్కెట్‌కు వెళ్లిన ఇద్దర్ని సూపర్ మార్కెట్ సెక్యూరిటీ గార్డులు అడ్డుకుని.. అనుమతి లేదంటూ భయటికి పంపేశారు. వాస్తవానికి వారు చైనీయులు కాదు.. మన భారతీయులే.. వారిస్వస్థలం మణిపూర్.

కేటీఆర్ రియాక్షన్..

వారి వద్ద ఉన్న ఆధార్ కార్డు మొదలుకుని అన్ని ఆధారాలు చూపించినప్పటికీ వారి మాటలను అస్సలు లెక్కచేయలేదు. ఇలా ఆ ఇద్దరు వ్యక్తులు, సెక్యూరిటీల మధ్య వాదోపవాదాలు నడిచాయి. చివరికి చేసేదేమీ లేక అక్కడ్నుంచి ఆ ఇద్దరూ వచ్చేశారు. అనంతరం ఈ తంతుకు సంబంధించిన వీడియోను చిత్రీకరించి మంత్రి కేటీఆర్‌తో పాటు పోలీసులు, ఇంకా చాలా మందికి ట్యాగ్ చేస్తూ చూడండి సార్ ఎంత వివక్ష చూపిస్తున్నారో అని జోనాహ్ అనే వ్యక్తి తన మిత్రులకు జరిగిన విషయాన్ని ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు. వెంటనే స్పందించిన కేటీఆర్.. సూపర్ మార్కెట్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. అంతేకాదు.. ఇలాంటి ఘటనలు జరగకుండా కమిషనర్లు, ఎస్పీలకు సూచనలు చేయాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు.

కఠిన చర్యలు తప్పవు..

ఇది రాచకొండ పరిధిలోకి వస్తుంది. వెంటనే ఈ వ్యవహారంపై రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ స్పందించారు. ఇలాంటి ఘటనలను సహించేది లేదని.. ఎవరైనా వివక్ష చూపితే 9490617234, డయల్ 100 నెంబరుకు ఫిర్యాదు చేయాలని సూచించారు. సదురు సూపర్ మార్కెట్ స్టోర్ మేనేజర్, ఇద్దరు గార్డ్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని.. ఎఫ్ఐఆర్ 344/2020 ప్రకారం 153, 188, 341 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని కఠిన చర్యలు తప్పవని మహేష్ భగవత్ హెచ్చరించారు.

More News

కరోనాపై పోరు: అగ్రరాజ్యం కంటే ఇండియా చాలా బెటర్!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. ఈ వైరస్ బారిన ఎవరెప్పుడు పడుతున్నారో..? ఎంతమంది చనిపోతున్నారా లెక్కలు తెలియని పరిస్థితి.

చిరు ట్వీట్‌కు తెలంగాణ డీజీపీ ఇంట్రెస్టింగ్ రిప్లయ్

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో దాన్ని నిర్మూలించడానికి వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు.. ఓ వైపు లాక్‌డౌన్‌ను పకడ్బందిగా అమలు చేస్తున్న పోలీసులపై ప్రముఖులు ప్రశంసల జల్లు

మద్యం డోర్ డెలివరీపై ఆర్జీవీ ట్వీట్.. కేటీఆర్ పంచ్!

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ ఏదో వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు.

రామ్‌చ‌ర‌ణ్‌ హీరోయిన్ ఇప్పుడు బన్నీకి స్పెషల్

టైటిల్ చ‌దివిన త‌ర్వాత మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మెగా క్యాంప్ హీరోలే. వీరిద్ద‌రూ ఒక‌రికొక‌రు ఏం చేసుకున్నారు? అనే సందేహం రావ‌చ్చు.

కన్న‌డ‌లో రీమేక్‌కానున్న అడివి శేష్ చిత్రం..?

ఈ మ‌ధ్య తెలుగు సినిమాల ట్రెండ్ మారింది. డిఫరెంట్ సినిమాలు రూపొందుతున్నాయి. కొత్త కాన్సెప్ట్ సినిమాలు చేయ‌డానికి హీరోలు, చూడ‌టానికి ప్రేక్ష‌కులు ఆస‌క్తిని చూపుతున్నారు.