Race Pre Poll Survey: మళ్లీ గెలిచేది జగనే.. రేస్ ప్రీ పోల్ సర్వేలో స్పష్టం..

  • IndiaGlitz, [Saturday,May 11 2024]

ఏపీలో పోలింగ్‌కు మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉంంది. దీంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కూటమి అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ప్రజలను ఆకర్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ మీడియా, సర్వే సంస్థలు తమ ఫలితాలను వెల్లడిస్తున్నాయి. అయితే ప్రతి సర్వేలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఖాయమని స్పష్టమవుతోంది. ఇప్పటికే అనేక సర్వేల్లో ఇదే తేలింది. తాజాగా మరో సంస్థ చేసిన సర్వేలోనూ వైసీపీ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని తేలింది.

ప్రముఖ సర్వే సంస్థ రేస్ ప్రీ-పోల్ సర్వే.. ఏపీ రాజకీయాలపై తన సర్వేను నిర్వహించింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేదెవరనేది తేల్చి చెప్పింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మార్చి 16 నుంచి మే 8వ తేదీ మధ్యన ఈ సర్వే నిర్వహించినట్లు తెలిపింది. ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం ఏపీలో మరోసారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయంగా ఉంది. 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ 123 నుంచి 128 అసెంబ్లీ స్థానాల్లో విజయఢంకా మోగిస్తుంది. టీడీపీ కూటమి కేవలం 47-52 స్థానాలు మాత్రమే గెలుచుకుంటుందని చెప్పుకొచ్చింది. సీఎంగా జగన్ పనితీరుపై 55.10% మంది సంతృప్తి వ్యక్తం చేయగా.. మళ్లీ జగనే ముఖ్యమంత్రి కావాలంటూ 61.20% మంది తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.

కాగా ఈ సర్వే ప్రకారం సీఎం జగన్ ఐదేళ్ల పాలనపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పింది. అలాగే కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సర్వేలో పేర్కొన్నారు. వాలంటీర్ వ్యవస్థ, విద్య, వైద్య రంగాల్లో తీసుకొచ్చిన సంస్కరణలపై ప్రజలు సంతోషంగా ఉన్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాల్లో వైసీపీ పాలనపై పెద్ద ఎత్తున సానుకూలత ఉందని వివరించింది. మొత్తానికి ఏపీలో జగన్‌ పాలనకు తిరుగులేదని.. మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టంచేసింది.

More News

Modi: ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది: ప్రధాని మోదీ

దేశవ్యాప్తంగా నాలుగో విడత పోలింగ్ మే 13న జరగబోతుంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు.. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలతో పాటు సికింద్రబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నిక జరగనుంది.

నా భార్యను క్షమించమని అడిగాను: పవన్ కల్యాణ్‌

గత పదేళ్ల నుంచి ధర్మం కోసం పోరాడుతున్నానని.. ధర్మో రక్షతి రక్షితః అని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తెలిపారు. పిఠాపురంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు.

ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలకు టీజీ సీఎం రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్

ఏపీ ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది. మరికాసేపట్లో ప్రచారం ముగియనుంది. దీంతో నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అలాగే ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.

CM Jagan: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు మనిషి అంటూ ఏపీ సీఎం జగన్ ఆరోపించారు. కడపలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు

Sharmila: సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలతో షర్మిల కంటతడి

షర్మిల రాజకీయ కాంక్షతోనే వైఎస్ కుటుంబంలో విభేదాలు వచ్చాయన్న సీఎం జగన్ వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కంటతడి పెట్టారు.