రెండో రేసు గుర్రం వ‌స్తోందా?

  • IndiaGlitz, [Thursday,May 10 2018]

రేసు గుర్రం.. 2014 వేస‌వికి విడుద‌లై ఆ ఏడాదిలోనే హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌గా నిలిచిన మూవీ ఇది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ సినిమాకి సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. శ్రుతి హాస‌న్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రంలో కిక్ శ్యామ్‌, స‌లోని, బ్ర‌హ్మానందం, ర‌వి కిష‌న్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. అన్న‌ద‌మ్ముల అనుబంధం నేప‌థ్యంలో రూపొందిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల గ‌ల‌గ‌ల‌లు వినిపించింది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన సీక్వెల్ రెడీ అవుతోంద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు ముచ్చ‌టించుకుంటున్నాయి. స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తిచేసుకున్న ఈ సినిమాలోనూ బ‌న్నీనే క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్నారు. అయితే ద‌ర్శ‌కుడు, నిర్మాణ సంస్థ‌కి సంబంధించిన పూర్తివివ‌రాలు మ‌రికొద్ది రోజుల్లో వెల్ల‌డి కానున్నాయి.

కాగా.. అల్లు అర్జున్ న‌టించిన తాజా చిత్రం నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. రేసు గుర్రం ర‌చ‌యిత వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా.. బ‌న్నీ  కెరీర్ బెస్ట్ పెర్‌ఫార్మెన్స్‌లో ఒక‌టిగా నిలిచింది.

More News

ప‌ద‌హారేళ్ళు పూర్తి చేసుకున్న అల్ల‌రి న‌రేశ్‌

హాస్య ప్ర‌ధాన చిత్రాల‌కు చిరునామాలా నిలిచిన ఈ త‌రం హాస్య క‌థానాయ‌కుడు అల్ల‌రి న‌రేశ్‌. ఒక టైమ్‌లో మినిమ‌మ్ గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న న‌రేశ్‌.. వ‌రుస సినిమాలు చేస్తూ వార్తల్లో నిలిచారు.

సుమంత్ అశ్విన్ హీరోగా ప్రొడక్షన్ నెం.3 'ప్రేమ కథా చిత్రం 2' ప్రారంభం

ప్రేమ కథా చిత్రం, జక్కన్న వంటి బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్స్ తో

'రంగస్థలం' కాంబో రిపీట్ చేస్తుందా?

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

చైతు, మారుతి సినిమా స‌గం పూర్త‌య్యింది

యూత్‌ఫుల్ మూవీస్‌తో విజయాలను అందుకున్న దర్శకుడు మారుతి. 'ఈ రోజుల్లో', 'బస్‌స్టాప్', 'ప్రేమకథా చిత్రమ్', 'కొత్తజంట', 'భలే భలే మగాడివోయ్', 'మహానుభావుడు' లాంటి సినిమాలతో విజయాలను అందుకుని..

లెజెండ్ సినిమా సమర్పణలో విజయ్ ఆంటోనీ 'కాశి' 

సెన్సిబుల్ చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటూ.. నటుడిగా, సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన పంధాను ఏర్పరుచుకొన్న విజయ్ ఆంటోనీ నటించిన తాజా చిత్రం 'కాశి'.