ఆర్.నారాయణమూర్తి కంటతడి.. ఫేక్ న్యూసే కారణం!

  • IndiaGlitz, [Thursday,July 15 2021]

విప్లవ భావజాలం, సినిమాలతో సీనియర్ నటుడు ఆర్. నారాయణమూర్తి లక్షలాది అభిమానులని సొంతం చేసుకున్నారు. నారాయణమూర్తి చాలా సింపుల్ గా ఆడంబరాలకు దూరంగా జీవించేందుకు ఇష్టపడతారు. సామాన్యుల్లో సామాన్యుడిగా కలిసిపోతారు. అలాంటి ఆర్. నారాయణమూర్తి ఓ ఫేక్ న్యూస్ వల్ల మానసికంగా ఇబ్బంది పడ్డారట. ఈ విషయాన్ని నారాయణమూర్తి స్వయంగా మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఇటీవల ఓ కార్యక్రమంలో ప్రజా గాయకుడు గద్దర్ మాట్లాడుతూ.. నారాయణమూర్తికి సొంత ఇల్లు లేదు. ఆస్తి లేదు. వాహనం లేదు. నడుచుకుంటూ వెళతారు. ఆయన్ని ఎవరూ ప్రశ్నించలేరు అని గద్దర్ అన్నారు. దీనితో నారాయణమూర్తి దీనస్థితిలో ఉన్నారని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని పుకార్లు షికార్లు చేశాయి.

దీనితో చాలా మంది నారాయణమూర్తికి ఫోన్ చేస్తున్నారట. ఆర్థిక సాయం చేస్తామని చెబుతున్నారట. ఈ వ్యవహారం తనని మానసికంగా కుంగదీసినట్లు నారాయణమూర్తి తెలిపారు. తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని మీడియా సమావేశంలో ఖండించారు.

'నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. నేను ధనికుడిని. నాకు ఏదైనా సమస్య వస్తే సాయం చేసే ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు. నన్ను ఎంతో అభిమానించే ప్రేక్షక దేవుళ్ళు ఉన్నారు అని నారాయణమూర్తి అన్నారు. సినిమా అన్నాక అప్పులు చేయడం తర్వాత తీర్చడం చాలా మాములు విషయం. సినిమా చేసి ఆస్తులు కొనుక్కునే మనస్తత్వం నాది కాదు.

ప్రస్తుతం నా దృష్టి రైతన్న సినిమాపై ఉంది. రిలీజ్ చేసేందుకు రెడీగా ఉన్నా. ఇలాంటి తరుణంలో నేను దీనస్థితిలో ఉన్నానంటూ వస్తున్న అసత్య వార్తలు కుంగదీసే విధంగా ఉన్నాయి. అభిమానులు నాకు ఫోన్ చేసి జాలి చూపిస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి. గద్దర్ అన్న ఆ మాటలు అన్నప్పుడు వెంటనే.. అన్న న దగ్గర డబ్బు ఉంది అని చెప్పాను. ఆ వార్తని మాత్రం ఎవ్వరూ రాయడం లేదు. ఇది ధర్మం కాదు అని నారాయణమూర్తి అన్నారు. నా ప్రశాంతత కోసమే పల్లెటూరిలో ఉంటున్నట్లు నారాయణమూర్తి తెలిపారు.

More News

‘సెబాస్టియన్‌ పిసి524’ బర్త్-డే లుక్ కు అద్భుత స్పందన... త్వరలో తెలుగు, తమిళ భాషల్లో విడుదల

కథానాయకుడిగా పరిచయమైన ‘రాజావారు రాణిగారు’ సినిమాతో కంటెంట్‌ ఉన్న కుర్రాడని కిరణ్‌ అబ్బవరం పేరు తెచ్చుకున్నారు.

రాసుకుపూసుకు తిరుగుతున్నారుగా.. ఆ డబ్బంతా ఏమైంది: బాలకృష్ణ

నటసింహం నందమూరి బాలకృష్ణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

వావ్.. పౌరాణిక చిత్రంలో అల్లు అర్జున్ కుమార్తె.. ఎంట్రీ అదిరిందిగా!

అల్లు ఫ్యామిలీ నుంచి క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. అల్లు వారి కుటుంబంలో నాలుగోతరం నటులు రెడీ అవుతున్నారు.

4 గంటలపాటు విచారణ..కత్తి మహేష్ స్నేహితుడు చెప్పిన విషయాలేంటి ?

కత్తి మహేష్ రోడ్డు ప్రమాదం, మృతి కేసులో పోలీసులు విచారణని వేగవంతం చేశారు.

గ్రాండ్ లాంచ్ కి రెడీ అవుతున్న ఛత్రపతి రీమేక్.. ఈ విశేషాలు తెలుసా!

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ డెబ్యూకి రెడీ అవుతున్నాడు. ఛత్రపతి రీమేక్ లో శ్రీనివాస్ బాలీవుడ్ లో నటించబోతున్న సంగతి తెలిసిందే.