Quit Jagan: 'క్విట్ జగన్.. సేవ్ రాయలసీమ'.. ప్రజలకు చంద్రబాబు పిలుపు..

  • IndiaGlitz, [Saturday,March 30 2024]

రాయలసీమలో ట్రెండ్ మారిందని.. ప్రజలు ఇక వైసీపీ బెండు తీసేందుకు సిద్ధంగా ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) తెలిపారు. ఎన్నికల్లో 'క్విట్ జగన్.. సేవ్ రాయలసీమ' అనేది నినాదం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప జిల్లా ప్రొద్టుటూరులో నిర్వహించిన 'ప్రజాగళం' సభలో ఆయన ప్రసంగించారు. ఐదేళ్లలో రాయలసీమకు సీఎం జగన్ ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. కడప ఎవరి సొత్తు కాదని.. పులివెందుల ప్రజలు కూడా జగన్‌ను నమ్మడం లేదని విమర్శించారు.

రాయలసీమ అంటే జగన్‌కు హింస, హత్యా రాజకీయాలు అని తనకు మాత్రం నీళ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమలు తీసుకురావడం, పెట్టుబడులు, రైతును రాజు చేయడమే అన్నారు. టీడీపీ అధికారంలో ఉంటే ఎప్పుడో స్టీల్ ప్లాంట్ పూర్తి చేసేవాడిని అని చంద్రబాబు వెల్లడించారు. కడపకు స్టీల్ ప్లాంట్ వచ్చి ఉంటే వేలాది మందికి ఉద్యోగాలు వచ్చేవన్నారు. అనంతపురానికి కియా పరిశ్రమ తీసుకొచ్చానని అది తన బ్రాండ్ అని.. చేసిన వాటికే శంకుస్థాపనలు చేయం జగన్ బ్రాండ్ అని ఎద్దేవా చేశారు.

రాయలసీమకు నీళ్లిస్తే కోనసీమ కంటే మిన్నగా తయారవుతుందని.. అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతాన్ని రతనాల సీమగా మార్చే బాధ్యత తనదని చంద్రబాబు అన్నారు. పోలవరం పూర్తి చేసి గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకురావాలనే సంకల్పంతోనే 72 శాతం పనులు పూర్తి చేశామన్నారు. రాయలసీమ గురించి మాట్లాడే అర్హత ఈ జగన్‎కు లేదన్నారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ ఎక్కువైపోయాయని.. తాను అధికారంలోకి వచ్చిన 100 రోజులలో గంజాయి అమ్మేవాడిని భూమిపై ఉంచనని హెచ్చరించారు. తనది విజన్ అయితే జగన్‌ది పాయిజన్ అని సెటైర్లు వేశారు.

ఈ సందర్భంగా ఆడబిడ్డ నిధి కింద ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ రూ.1500.. తల్లికి వందనం పేరుతో రూ.15000 చొప్పున ఇస్తానని హామీ ఇచ్చారు. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని.. ప్రతి ఒక్క రైతుకు ఏడాదికి రూ.20వేల రూపాయలు ఇస్తామన్నారు. అలాగే నిరుద్యోగులకు రూ.3వేలు, వృద్దాప్య పెన్షన్ రూ.4వేలు ఇస్తామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని చంద్రబాబు వెల్లడించారు.

More News

Maheshwar Reddy: బీజేపీ ఎమ్మెల్యేలను ముట్టుకుంటే కాంగ్రెస్ సర్కార్ కూలిపోతుంది: మహేశ్వర్ రెడ్డి

తమ ఎమ్మెల్యేల్లో ఒక్కరిని టచ్ చేసినా 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరూ ఎవరికీ అమ్ముడుపోరని..

YS Sharmila: మహిళలకు ప్రతి నెలా రూ.8500.. ఏపీ కాంగ్రెస్ 9 గ్యారంటీలు ప్రకటన..

తాము అధికారంలోకి వస్తే 9 గ్యారంటీలను అమలు చేస్తామని ఏపీసీసీ చీఫ్‌ వైయస్ షర్మిల తెలిపారు. విజయవాడలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.

Chandrababu:దళితులంటే ద్వేషం.. పేదలంటే చులకన.. మారని చంద్రబాబు వైఖరి..

దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని గతంలో చంద్రబాబు మాట్లాడిన మాటలు ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు.

Pawan Kalyan:మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన పవన్ కల్యాణ్‌

మరో ఎంపీ అభ్యర్థిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా బాలశౌరిని ఖరారుచేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.

Vijayalakshmi:కాంగ్రెస్ పార్టీలో చేరిన హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి

లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది.  గ్రేటర్ హైదరాబాద్ మేయర్, బీఆర్ఎస్ కీలక నేత గద్వాల విజయలక్ష్మీ కాంగ్రెస్ పార్టీలో చేరారు.