కింగ్‌(ప్రభాస్‌)కి క్వీన్ సెట్.. పిచ్చెక్కించేద్దాం: నాగ్ అశ్విన్

‘మహానటి’తో దర్శకుడిగా తన సత్తాను నిరూపించుకున్న నాగ్ అశ్విన్ తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ 21వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. సినిమాకు సంబంధించిన ప్రి ప్రొడక్షన్ వర్క్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై సి.అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హీరోయిన్ కూడా సిద్ధమై పోయింది. బాలీవుడ్ భామను హీరోయిన్‌గా నాగ్ అశ్విన్ సెట్ చేశారు.

ఎందరో బాలీవుడ్ భామలను పరిశీలించిన మీదట దర్శక నిర్మాతలు దీపికకు ఓకే అయ్యారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ నాగ్ అశ్విన్ ట్వీట్ చేశారు. ’కింగ్ పక్కన సరిపడేంత క్వీన్ కావాలి కదా మరి.. చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. పిచ్చెక్కించేద్దాం’ అని అంటూ నాగ్ అశ్విన్ ట్వీట్ చేశారు. సైంటిఫిక్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. ‘బాహుబలి’ తర్వాత ‘సాహో’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్.. ఆశించిన ఫలితాన్నైతే పొందలేకపోయాడు. మరి నాగ్ అశ్విన్ ఏం చేస్తారో చూడాలి.

More News

మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్..

మరో వైసీపీ ఎమ్మెల్యేకు తాజాగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇటీవలి కాలంలో వైసీపీ ఎమ్మెల్యేలు వరుసగా..

గోదావరి జిల్లాను కుదిపేస్తున్న కరోనా

కరోనా వైరస్ ఏపీలో విజృంభిస్తున్న విషయం తెలిసిందే. అయితే గతంలో కర్నూలు జిల్లాలో ఎక్కువగా కేసులు నమోదవుతూ వచ్చాయి.

‘పవర్‌స్టార్’ వేదికగా.. మరో సంచలనానికి తెరదీసిన వర్మ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెరదీశారు. ఇప్పటి వరకూ ప్రపంచ సినీ చరిత్రలో లేని సరికొత్త విధానానికి వర్మ శ్రీకారం చుట్టబోతున్నారు.

కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!

కరోనా వైరస్.. తెలంగాణ నెత్తిపై పెద్ద పిడుగే వేసింది. మాటల్లో చెప్పలేనంత అప్రదిష్టను తెచ్చిపెట్టింది.

ఏపీలో షాక్.. ఒక్కరోజే దాదాపు 4 వేల కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసులు షాక్ ఇచ్చాయి. 2500 కేసులు నమోదవుతుంటేనే జనం భయపడిపోతుంటే..