వంశీ పైడిప‌ల్లి పై ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ కి ఫిర్యాదు చేసిన పివిపి..!

  • IndiaGlitz, [Thursday,December 29 2016]

డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి పివిపి బ్యాన‌ర్ లో ఊపిరి సినిమా చేసారు. ఆత‌ర్వాత ఇదే బ్యాన‌ర్ లో వంశీ పైడిప‌ల్లి మ‌హేష్ బాబు హీరోగా ఓ సినిమా చేయ‌డానికి అంగీక‌రించారు. మ‌హేష్ బాబు ఈ బ్యాన‌ర్ లో చేసిన బ్ర‌హ్మోత్స‌వం సినిమా ప్లాప్ అవ్వ‌డంతో పివిపికి మ‌రో సినిమా చేస్తాన‌ని మాట ఇచ్చారు. గ‌త కొన్ని రోజులుగా వంశీ పైడిప‌ల్లి పివిపి ఆఫీస్ లో ఉంటూ మ‌హేష్ కోసం స్ర్కిప్ట్ రెడీ చేసారు. మ‌రి...ఏమైందో ఏమో కానీ...వంశీ పైడిప‌ల్లి నిర్మాత‌ను మార్చేసి మ‌హేష్ 25వ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాను.

ఈ చిత్రాన్ని అశ్వ‌నీద‌త్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించ‌నున్నారు అని ట్విట్ట‌ర్ ద్వారా ఎనౌన్స్ చేసారు. దీంతో పివిపికి కోపం వ‌చ్చింది. త‌న ఆఫీస్ లో ఉంటూ స్ర్కిప్ట్ రెడీ చేసి ఇప్పుడు త‌న‌కు కాకుండా వేరే నిర్మాత‌తో సినిమా చేస్తుండ‌డం ఏమిటి అంటూ ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్ కు వంశీ పైడిప‌ల్లి పై పివిపి ఫిర్యాదు చేసార‌ని స‌మాచారం. మ‌రి...పివిపి ఫిర్యాదుకు వంశీ పైడిప‌ల్లి ఏం స‌మాధానం చెబుతారో..? ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్ ఎలాంటి ప‌రిష్కారం చూపిస్తుందో..?

More News

ఖైదీ నెం 150 రిలీజ్ డేట్ & టార్గెట్ ఫిక్స్..!

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న ఖైదీ నెం 150 చిత్రం సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. జ‌న‌వ‌రి 1న సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేయ‌నున్నారు.

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఖైదీ నెం.150 ఆడియో..!

ఆడియో రంగంలో ఎన్నో సంచలనాలు సృష్టించి మరెన్నో సూపర్హిట్ ఆల్బమ్స్ని అందించిన సంస్థగా పేరు తెచ్చుకున్న లహరి మ్యూజిక్ మళ్ళీ వరుసగా సూపర్ డూపర్హిట్ ఆడియోలను ప్రేక్షకులకు అందిస్తూ విజయపథంలో దూసుకెళ్తున్న ఈ సంస్థ తాజాగా మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టీజియస్ మూవీ 'ఖైదీ నెం.150' చిత్రం ఆడియోను విడుదల చేసింది.

నారా రోహిత్ న్యూయర్ ప్లాన్స్..!

వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న యువ హీరో నారా రోహిత్.

సీక్వెల్ తీస్తానంటున్న స‌ప్త‌గిరి..!

క‌మెడియ‌న్ గా కెరీర్ ప్రారంభించి...స‌ప్త‌గిరి ఎక్స్ ప్రెస్ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మైన యువ న‌టుడు స‌ప్త‌గిరి. ఇటీవ‌ల రిలీజైన స‌ప్త‌గిరి ఎక్స్ ప్రెస్ చిత్రం స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా స‌ప్త‌గిరి మీడియాతో మాట్లాడుతూ....ద‌ర్శ‌కుడు అవ్వాల‌ని ఇండ‌స్ట్రీకి వ‌చ్చాను. అనుకోకుండా క‌మెడియ‌న్ అయ్యాను.

అఖిల్ 3వ సినిమాకి గ్రీన్ సిగ్నల్..!

అక్కినేని అఖిల్ రెండవ చిత్రాన్ని మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే.