అద్భుత విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు - పూరి

  • IndiaGlitz, [Saturday,May 12 2018]

ఆకాష్‌ పూరిని హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై పూరి కనెక్ట్స్‌ నిర్మాణంలో డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో నిర్మించిన 'మెహబూబా' విడుదలైన అన్ని కేంద్రాల్లో సూపర్‌ టాక్‌తో, సూపర్‌ కలెక్షన్స్‌తో సూపర్‌హిట్‌ దిశగా పయనిస్తోంది.

ఈ సందర్భంగా దర్శకులు పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ నిన్న రిలీజ్‌ అయిన 'మెహబూబా' చిత్రానికి అన్ని సెంటర్స్‌ నుంచి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. కలెక్షన్లు చాలా చాలా బాగున్నాయి. ఆకాష్‌కి ఇది మొదటి సినిమా అయినప్పటికీ చాలా అద్భుతంగా పెర్‌ఫార్మ్‌ చేశాడు. ఒక కొత్త హీరోకి ఇంతటి భారీ ఓపెనింగ్స్‌ రావడం చాలా ఆనందంగా ఉంది. ఆకాష్‌ పెర్‌ఫార్మెన్స్‌ గురించి, అతను చెప్పిన డైలాగ్స్‌ గురించి అందరూ అప్రిషియేట్‌ చెయ్యడం తండ్రిగా నాకు చాలా ఆనందంగా ఉంది.

అలాగే ఫోటోగ్రఫీ, మ్యూజిక్‌... ఇలా టెక్నికల్‌గా కూడా మంచి అప్రిషియేషన్‌ రావడంతో మా యూనిట్‌ అంతా చాలా హ్యాపీగా ఉన్నాం. 'మెహబూబా' చిత్రాన్ని ఇంతగా ఆదరిస్తూ, ఆకాష్‌ని ఆశీర్వదించిన ప్రేక్షకులకు స్పెషల్‌ థాంక్స్‌. ఈ విజయం దర్శకుడుగా నాకు మరింత ఉత్సాహాన్నిచ్చింది.

ఈ సక్సెస్‌కి కారకులైన యూనిట్‌లోని ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. దర్శకుడుగా నా కెరీర్‌లో ఎన్నో విజయాలు అందుకున్నాను. 'మెహబూబా' సాధించిన ఘనవిజయం భవిష్యత్తులో మరిన్ని పెద్ద హిట్‌ సినిమాలు తియ్యడానికి స్ఫూర్తినిచ్చింది'' అన్నారు.

More News

'మ‌హాన‌టి'ని చూస్తుంటే నా గుండె బ‌రువెక్కింది..క‌ళ్లు చెమ‌ర్చాయి: మెగాస్టార్ చిరంజీవి

కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌లో నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ ప‌తాకంపై ప్రియాంక‌ద‌త్త్, స్వ‌ప్న ద‌త్త్ నిర్మించిన 'మ‌హాన‌టి' ఇటీవ‌ల విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.

 నారా రోహిత్, జగపతిబాబుల 'ఆటగాళ్లు' ఫస్ట్ లుక్ విడుదల

నారా రోహిత్, జగపతిబాబు ప్రదానపాత్రల్లో పరుచూరి మురళి దర్శకత్వంలో వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసిరెడ్డి శివాజీ ప్రసాద్, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'ఆటగాళ్లు'.

ఈ నెల 18న వ‌స్తోన్న 'క్రైమ్‌ 23'!!

'బ్రూస్‌ లీ', 'ఎంతవాడుగాని' చిత్రాల‌లో విల‌న్‌గా నటించి తెలుగు ప్రేక్షకుల‌ను మెప్పించాడు అరుణ్ విజ‌య్‌. ఈయ‌న  సీనియర్‌ నటులు విజయ్‌ కుమార్‌-మంజుల‌ తనయుడు.

యువ ద‌ర్శ‌కుడితో చిరు?

ప్ర‌స్తుతం సైరా న‌ర‌సింహారెడ్డి సినిమాతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి త‌దుస‌రి సినిమా గురించి ప‌లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

విశాల్ ఇంటికి భ‌ద్ర‌త‌...

త‌మిళ హీరో, త‌మిళ నిర్మాత‌ల మండ‌లి ప్రెసిడెంట్‌, న‌డిగ‌ర్ సంఘ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విశాల్ ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్నారు.