పూరి - ఛార్మి వార్త‌ల వెన‌కున్న వాస్త‌వం ఇదే..

  • IndiaGlitz, [Friday,March 11 2016]

డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ - ఛార్మింగ్ బ్యూటీ ఛార్మి...వీరిద్ద‌రూ క‌ల‌సి జ్యోతిల‌క్ష్మి అనే సినిమా తీసిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో ఛార్మి హీరోయిన్ గా న‌టించ‌డమే కాదు...నిర్మాణ బాధ్య‌త‌లు కూడా చేప‌ట్టింది. ఈ టైమ్ లోనే ఛార్మి పూరితో అనుబంధం పెంచుకుంది. కేవ్ (పూరి ఆఫీస్) ని త‌న కంట్రోల్ లో పెట్టుకుంది. జ్యోతిల‌క్ష్మి సినిమాకి నిర్మాణ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డంతో ఛార్మికి బాగా క‌ల‌సి వ‌చ్చింది. ఇంకేముంది పూరి తీసే అన్ని సినిమాల‌కు నిర్మాణ బాధ్య‌త‌లు నేనే చూసుకుంటానందట‌. పూరి కాద‌న‌లేక‌పోయాడట‌.

అయితే జ్యోతిల‌క్ష్మి త‌ర్వాత పూరి నితిన్ తో ఓ సినిమా చేయాల‌నుకున్నారు. అంతా ఓకే అయిపోయింది. ఇక షూటింగ్ స్టార్ట్ చేయ‌డ‌మే ఆల‌స్యం. పూరి...నిర్మాణ బాధ్య‌త‌లు చూసుకుంటానంటే ఓకే అని ఛార్మికి మాట ఇచ్చాడు. సో...నితిన్ తో చేసే సినిమా నిర్మాణ బాధ్య‌త‌లు కూడా నేనే చూసుకుంటానంది. అక్క‌డే వ‌చ్చింది అస‌లు స‌మ‌స్య‌. నితిన్ ఫాద‌ర్ సుధాక‌ర్ రెడ్డి ఛార్మి ఇన్ వాల్వ్ మెంట్ కి నో చెప్ప‌డంతో ప్రాజెక్ట్ పోయింద‌ట‌. ఆత‌ర్వాత ఆ ప్రాజెక్టే వ‌రుణ్ తేజ్ తో లోఫ‌ర్.

అయితే ఛార్మి కేవ్ ని కంట్రోల్ చేయ‌డం...పూరి టీమ్ పై పెత్త‌నం చెలాయించ‌డం రోజురోజుకి పెరిగిపోయింద‌ట‌. అంతే కాదండోయ్...పూరి తాజా చిత్రం రోగ్ సినిమా నిర్మాణంలో కూడా ఛార్మి చాలా చేయాల‌నుకుని ప్లాన్ చేసింద‌ట‌. ఇదంతా పూరి కి అస‌లు న‌చ్చ‌లేద‌ట‌. అంతే..పూరి నేనింతే సినిమాలో రాసిన డైలాగ్ గుర్తు చేసుకున్నాడు...తుడుచుకుంటే పోతుంది అనుకుంటే నూటికి 99 సార్లు రెడీ...కానీ..నేనే పోతాను అనుకుంటే...నువ్వు పోతావ్..ఈ డైలాగ్ ని అక్ష‌రాల నిజం చేసాడు.

ఛార్మితో ఎఫైర్ ఉంద‌ని ఎంత మంది ఎన్ని ర‌కాలుగా అన్నా...మీడియా ఎన్ని ర‌కాలుగా రాసినా...ప‌ట్టించుకోలేదు పూరి. అయితే ఛార్మికి నిర్మాణ బాధ్య‌త‌లు అప్ప‌చెప్ప‌డం అనేది అస‌లుకే మోసం వ‌చ్చేలా ఉంద‌ని తెలుసుకున్నాడు. అంతే... ఛార్మిని కేవ్ (పూరి ఆఫీస్) నుంచి పంపించేసాడు. పూరి త‌న టీమ్ ని కూడా ప్ర‌క్షాళ‌న చేసి..కొత్త టీమ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ...ఎందుక‌నో పూరి - ఛార్మి మ‌ళ్లీ క‌లిసార‌ని...రోగ్ కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తుంది అంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. కానీ..ఆ వార్త‌ల్లో నిజం లేదు. ఇది నిజం...ఇదే నిజం.

More News

వెరైటీ టైటిల్ తో అల‌ర్లి న‌రేష్‌..

అల్ల‌రి సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మై...తొలి సినిమా టైటిలే ఇంటిపేరుగా పాపుల‌ర్ అయిన యువ క‌థానాయ‌కుడు అల్ల‌రి న‌రేష్. రాజేంద్ర‌ప్ర‌సాద్ త‌ర్వాత ఈత‌రంలో కామెడీ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అంటే అల్ల‌రి న‌రేష్.

ఫ్యాన్స్ కి అంకితం ఇస్తున్న స‌ర్ధార్..

ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ క‌ళ్యాణ్ హీరోగా బాబీ తెర‌కెక్కిస్తున్న సెన్సేష‌న‌ల్ మూవీ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. ఈ చిత్రాన్ని ప‌వన్ ఫ్రెండ్ శ‌ర‌త్ మ‌రార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

మ‌రోసారి యంగ్ టైగ‌ర్‌తో జ‌గ్గూబాయి...?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందిన నాన్న‌కు ప్రేమ‌తో చాణక్య అనే నెగ‌టివ్ పాత్ర‌లో న‌టించి మెప్పించిన న‌టుడు జ‌గ‌ప‌తిబాబు ఇప్పుడు మ‌రోసారి యంగ్‌టైగ‌ర్‌తోన‌టించే అవ‌కాశాన్ని ద‌క్కించుకున్నాడని టాలీవుడ్ వ‌ర్గాలు అనుకుంటున్నాయి.

సరైనోడు లో విశాల్ సాంగ్...

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ -బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్నభారీ చిత్రం సరైనోడు.

మార్చి 25న కామెడీ ఎంటర్ టైనర్ 'పోకిరి రాజా'

2011లో వచ్చిన రంగం చిత్రంతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు స్టార్ హీరో జీవా.