పున్న‌మిరాత్రి 30న విడుద‌ల‌

  • IndiaGlitz, [Monday,October 19 2015]

శ్ర‌ద్ధాదాస్‌, మోనాల్ గ‌జ్జ‌ర్‌, శ్వేత‌బ‌సు ప్ర‌సాద్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన సినిమా పున్న‌మి రాత్రి. క‌ల‌ర్స్ అండ్ క్లాప్స్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంస్త నిర్మిస్తోంది. విన‌య‌న్ ద‌ర్శ‌కుడు. ఎం.సుబ్బారెడ్డి నిర్మాత‌. ఈ సినిమాకు సంబంధించి అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తయ్యాయి. అక్టోబ‌ర్ 30న విడుద‌ల చేయ‌నున్నారు. తొలి సారి త్రీడీలో వ‌స్తున్న హార‌ర్ సినిమా ఇది. త‌ప్ప‌కుండా అంద‌రినీ అల‌రించే డ్రాకులా సినిమా అవుతుంది అని శోభారాణి తెలిపారు.

నిర్మాత మాట్లాడుతూ ''ఆడు మ‌గాడ్రా బుజ్జి సినిమాతో తెలుగు ప‌రిశ్ర‌మ‌లోకి ఎంట‌ర్ అయ్యాం. పున్న‌మి రాత్రి మా సంస్థ‌లో రెండో సినిమా. త్రీడీతో పాటు టూడీలోనూ ఈ సినిమాను చేశాం. ఈ నెల 30న సినిమాను విడుద‌ల చేస్తాం'' అని చెప్పారు. స‌హ నిర్మాత సిరాజ్ మాట్లాడుతూ ''త్రీడీ థియేట‌ర్ల కోసం ఎదురుచూశాం. రుద్ర‌మ‌దేవి చిత్రంతో 150 త్రీడీ థియేట‌ర్లు వ‌చ్చాయి. అక్టోబ‌ర్ 30న విడుద‌ల చేస్తాం'' అని అన్నారు.

మంచి పాట‌లు కుదిరాయ‌ని సంగీత ద‌ర్శ‌కుడు ర‌ఘురామ్ చెప్పారు. ఈ సినిమాకు లైన్ ప్రొడ్యూస‌ర్‌; రాజీవ్ రామా, కెమెరా: స‌తీష్ బాబు, సంగీతం; భ‌బిత్ జార్జ్, ర‌ఘురామ్‌.

More News

సెన్సార్ పూర్తి చేసుకున్న 'షేర్'

నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా సాయి నిహారిక, శరత్‌చంద్‌ సమర్పణలో విజయలక్ష్మీ పిక్చర్స్‌ పతాకంపై మల్లికార్జున్‌ దర్శకత్వంలో కొమర వెంకటేష్‌ నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘షేర్‌’.

సుమంత్ నమ్మకం ఫలిస్తుందా?

ఎం.ఎస్.రాజు తనయుడు అనే ట్యాగ్ లైన్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సుమంత్ అశ్విన్.'అంతకు ముందు ఆ తరువాత','లవర్స్','కేరింత'వంటి హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

అర్జున్ తో అనుష్క‌

అర్జున్ అన‌గానే సీనియ‌ర్ హీరో అర్జున్ అనుకుంటే పొర‌పాటే. విష‌యం ఏమిటంటే...అల్లు అర్జున్ తో అనుష్క న‌టిస్తుందట‌.

నాగ్‌, చైత‌న్య‌.. నాలుగోసారి

ఒకే కుటుంబానికి చెందిన ఇద్ద‌రు హీరోల సినిమాలు ఒకే నెల‌లో విడుద‌ల‌వ‌డం అరుదు. ఈ నెల‌లో మెగా ఫ్యామిలీకి చెందిన మూడు సినిమాలు విడుద‌ల‌వ‌డం అలాంటి అరుదైన అంశమే.

ఆ ఇద్ద‌రి త‌రువాత స‌మంత‌

న‌టుడిగా 25 ఏళ్ల అనుభ‌వం విక్ర‌మ్ సొంతం. ఇటీవ‌లే పాతికేళ్ల న‌ట ప్ర‌స్థానాన్ని పూర్తి చేసుకున్నాడు స‌ద‌రు వెర్స‌టైల్ ఆర్టిస్ట్‌.