'పులి' త్రీడీ...

  • IndiaGlitz, [Monday,September 28 2015]

తమిళ స్టార్ హీరో విజయ్, శృతిహాసన్, హన్సిక హీరో హీరోయిన్లుగా శ్రీదేవి ప్రధానపాత్రలో రూపొందుతోన్న చిత్రం పులి'. భారీ బడ్జెట్, విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అక్టోబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. సినిమా ప్రమోషన్స్ స్టార్టయ్యాయి. అందులో భాగంగా ఎపిక్ క్లాష్ అనే టైటిల్ తో పులి త్రీడీ గేమ్ ను విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల కత్తి', గబ్బర్ ఈజ్ బ్యాక్' చిత్రాలకు సంబంధించిన త్రీడీ గేమ్స్ ను రూపొందించిన స్కై టౌ స్టూడియో ఈ గేమ్ రూపకల్పన ప్లాన్ చేస్తుంది. అందుకు సంబంధించిన వర్క్ జూలై నుండి ప్రారంభమైందని సంస్థ ప్రతినిధి తెలియజేశారు.