రచ్చకెక్కిన దాస‌రి త‌న‌యుల ఆస్థి గొడ‌వ‌

  • IndiaGlitz, [Friday,June 26 2020]

సీనియ‌ర్ దివంగ‌త ద‌ర్శ‌కుడు డా.దాస‌రి నారాయ‌ణ‌రావు త‌న‌యుల మ‌ధ్య ఆస్థి గొడ‌వ‌లు రేగాయి. దాస‌రి పెద్ద కొడుకు ప్ర‌భు, చిన్న కొడుకు అరుణ్ కుమార్‌పై జూబ్లీహిల్స్‌ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దాస‌రి అరుణ్ కుమార్ బుధ‌వారం రాత్రి త‌మ ఇంటిలోకి వ‌చ్చి దాడి చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంట్లోకి గోడ దూకి వ‌చ్చిన అరుణ్ కుమార్ త‌మ తండ్రి బీరువాను తెరిచే ప్ర‌య‌త్నాన్ని చేశాడ‌ని ప్ర‌భు తెలిపారు.

మ‌ద్యం తాగి వ‌చ్చిన అరుణ్‌కుమార్ త‌మ కుటుంబ స‌భ్యుల‌పై దాడి చేసే ప్ర‌య‌త్నం చేశాడ‌ని, అరుణ్‌పై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. సినీ ప్ర‌ముఖులైన మోహ‌న్‌బాబు, ముర‌ళీమోహ‌న్‌, సి.క‌ల్యాణ్ త‌దిత‌రులు వెంట‌నే స్పందించాల‌ని ప్ర‌భు తెలిపారు. తాము ఇప్పుడు ఉంటున్న ఇంటిని త‌న తండ్రి దాస‌రి త‌న కుమార్తె పేరు మీద రాశార‌ని వీలునామా ప్ర‌కార‌మే తాము ఇంటిలో ఉన్నామ‌ని ప్ర‌భు ఈ సంద‌ర్భంగా తెలిపారు. అయితే నెటిజ‌న్స్ మాత్రం ఆయ‌న త‌న‌యుల‌పై మండిప‌డుతున్నారు. ఇండ‌స్ట్రీకి పెద్ద‌న్న‌లా వ్య‌వ‌హ‌రించిన దాస‌రి నారాయ‌ణ‌రావు ప‌రువుని జ‌జారుని పెడుతున్నారంటూ నెటిజ‌న్స్ విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

More News

హుద్రోగులు, హై బీపీ ఉన్న వారికి షాకింగ్ న్యూస్..

కరోనా నుంచి కోలుకున్న బాధితుడికి తిరిగి వచ్చే అవకాశం ఉందా? అంటే.. అలా అని ఇప్పటి వరకూ ఎలాంటి ఆధారాలూ లేవని వైద్యులు చెబుతున్నారు.

చైనాపై పోరులో భారత్‌కు మద్దతిచ్చేందుకు సిద్ధమైన అమెరికా!

చైనాపై పోరుకు సిద్ధమవుతున్న భారత్‌కు మద్దతు ఇస్తామని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది.

ఏపీ కరోనా బులిటెన్ విడుదల.. కొత్తగా..

ఏపీ కరోనా బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 22వేల 305 శాంపిల్స్‌ని పరీక్షించగా 605 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డికి కరోనా పాజిటివ్ విషయమై ఏపీ ఆరోగ్యశాఖ వివరణ

టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డికి కరోనా వివాదంపై ఆరోగ్యశాఖ వివరణ ఇచ్చింది. ఆర్టీపీసీఆర్‌లో కచ్చితత్వం 67 శాతమేనని పేర్కొంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ నడిపేందుకు యత్నించి కింద పడిపోయిన ‘జెర్సీ’ హీరోయిన్

‘జెర్సీ’ సినిమా ద్వారా టాలీవుడ్‌కి పరిచయమైన ముద్దుగుమ్మ శ్రద్ధా శ్రీనాథ్. ఈ అమ్మడు 2017లో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను ఇన్‌స్టాగ్రాం వేదికగా అభిమానులతో పంచుకుంది.