'ప్రాజెక్ట్ C420' 80 శాతం షూటింగ్ పూర్తి

  • IndiaGlitz, [Monday,October 23 2017]

చైతన్య, దివి ప్రసన్న హీరో హీరోయిన్లుగా మహేష్ రెడ్డి దర్శకత్వంలో ఫిలిం N రీల్స్ బ్యానర్ పై రూపు దిద్దుకుంటున్న చిత్రం ప్రాజెక్ట్ C420 (వర్కింగ్ టైటిల్). సినిమా మొత్తం ఆస్ట్రేలియా లో షూటింగ్ జరుపుకుంటున్న మొట్ట మొదటి చిత్రమిది. ప్రస్తుతం 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విశేషాలను చిత్ర దర్శకుడు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్న మహేష్ రెడ్డి మాట్లాడుతూ .. ప్రాజెక్ట్ C420 చిత్రం మొట్టమొదటిసారి ఆస్ట్రేలియాలో మొత్తం సినిమా షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం. ఇప్పటి వరకు 80 శాతం షూటింగ్ పూర్తయింది. అక్టోబర్ ఎండింగ్ కి చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. చైతన్య, దివి ప్రసన్నలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆస్ట్రేలియా, చైనాకి సంబంధించిన నటీనటులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాకి పనిచేస్తున్న 80 శాతం టెక్నిషియన్స్ ఆస్ట్రేలియా వారే.. అని తెలిపారు.

ఈ చిత్రానికి సంగీతం: రాబిన్ కె మార్క్స్, కెమెరా: సంతోష్ శనమొని, ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్, ప్రొడక్షన్ హౌస్: ఫిలిం N రీల్స్, దర్శకత్వం: మహేష్ రెడ్డి.

More News

29న 'ప్రేమపందెం' ఆడియో విడుదల

శ్రీ లక్ష్మి ప్రొడక్షన్స్‌ పతాకంపై అనంతపురం జిల్లాకు చెంది ప్రముఖ విద్యాసంస్థ అధిపతి ఎం. లక్ష్మీనారాయణ నిర్మాతగా ఎం.ఎం. అర్జున్‌ దర్శకత్వంలో శ్రవణ్‌, మీనాక్షి గోస్వామి, జబర్‌దస్త్‌ వినోద్‌, కిరణ్‌ కళ్యాణ్‌, నరేష్‌, సాంబ శిమ ప్రధాన పాత్రధాయిగా నిర్మించిన చిత్రం ‘ప్రేమపందెం’.

నెట్ లో హల్ చల్ చేస్తున్న హీరోయిన్ మసాజ్ వీడియో

నాగార్జున నటించిన ఎదురులేని మనిషి చిత్రం లో సెకండ్ హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అయిన షెనాజ్ నటించింది.

'సాహో' ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌...

యంగ్ రెబ‌ల్‌స్టార్ పుట్టిన‌రోజు ఈరోజు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ న‌టిస్తోన్న చిత్రం 'సాహో' ఫ‌స్ట్‌లుక్ ను చిత్ర‌యూనిట్ విడుద‌ల చేసింది. పెద్ద మ‌హాన‌గ‌రంలో చీక‌టిలో న‌డిచి వ‌స్తున్నట్ల ప్ర‌భాస్ లుక్ క‌న‌ప‌డుతుంది.

మ‌హేష్ బాబు.. రెండు ఇంట్ర‌స్టింగ్‌ టైటిల్స్‌

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు ప్ర‌స్తుతం భ‌ర‌త్ అను నేను చిత్రంతో బిజీగా ఉన్నారు. శ్రీ‌మంతుడు త‌రువాత కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆయ‌న చేస్తున్న చిత్రమిది. కైరా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందిస్తున్నాడు.

ఏప్రిల్‌లో పెద్ద సినిమాల సంద‌డి

2018 ఏప్రిల్.. తెలుగు సినిమా విష‌యంలో ఆస‌క్తిక‌రంగా మారింది. మూడు పెద్ద ప్రాజెక్టులు వెండితెర‌పై సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఆర్డ‌ర్ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. కింగ్‌ నాగార్జున‌, సూప‌ర్‌స్టార్‌ మ‌హేష్ బాబు, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త చిత్రాలు ఏప్రిల్‌లో విడుద‌ల అయ్యే దిశ‌గా నిర్మాణం జ‌రుపుకుంటున్నాయి.