Prof Kodandaram: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరామ్‌

  • IndiaGlitz, [Thursday,January 25 2024]

గవర్నర్‌ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ నియమించారు. ప్రొఫెసర్‌ కోదండరామ్‌, అమరుల్లా ఖాన్‌ను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యమకారులకు పెద్ద పీట వేసేలా గవర్నర్ కోటాలో ఇద్దరి పేర్లను ప్రభుత్వం నామినేట్ చేయగా.. తాజాగా గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు రాజ్‌భవన్ ఉత్తర్వులు జారీ చేసింది.

2023 జూలై 31న గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణల పేర్లను అప్పటి కేసీఆర్ సర్కార్ గవర్నర్‌కు సిఫారసు చేసింది. అయితే ఈ ఇద్దరి పేర్లను గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. నిబంధనల మేరకు వీరి పేర్లను ఆమోదించలేమని ప్రభుత్వానికి తెలిపారు. దీంతో అప్పటి నుంచి ఈ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కోదండరామ్, అమరుల్లాఖాన్ పేర్లను సిఫార్సు చేయగా.. ఆమోదం లభించింది.

తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనకు ఏ పదవి ఇవ్వకుండా పక్కన పెట్టేసింది. దీంతో ఆయన తెలంగాణ జన సమితి పార్టీని పెట్టుకున్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆయన మద్దతు ఇచ్చారు. దీంతో కోదండరామ్ లాంటి ప్రొఫెసర్ సేవలు వినియోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి అప్పగించారు.

కాగా ఇటీవల తెలంగాణలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బల్మూరి వెంకట్‌, బొమ్మ మహేష్‌కుమార్‌ గౌడ్‌ ఎంపిక చేసింది. అయితే మిగతా పార్టీల నుంచి మరెవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో వీరిద్దరి ఎంపిక ఏకగ్రీవమైంది. తొలుత అద్దంకి దయాకర్ పేరును అధిష్టానం ప్రటించింది. కానీ చివరి నిమిషంలో ఆయనను మార్చి మహేష్‌కుమార్‌ గౌడ్‌కు అవకాశం ఇచ్చింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దయాకర్‌ను వరంగల్ ఎంపీ స్థానానికి పోటీ చేయించాలని భావించడంతోనే అవకాశం ఇవ్వలేదని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. మొత్తానికి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.

More News

TSPSC ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకం

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి(Mahendar Reddy) నియామకం అయ్యారు. ఆయన నియామకాన్ని గవర్నర్ తమిళిసై(Tamilisai) ఆమోదం తెలిపారు.

వైఎస్ కుటుంబాన్ని సీఎం జగనే చీల్చారు.. షర్మిల సంచలన వ్యాఖ్యలు..

సీఎం జగన్‌పై ఏపీసీసీ చీఫ్‌ వైయస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడుతూ వైఎస్సార్ కుటుంబం చీలింది

'యానిమల్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన 'యానిమల్' చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపిన సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ 1న రిలీజ్ అయిన

HMDA అవినీతి అనకొండ అరెస్ట్.. రూ.100కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు

హైదరాబాద్‌లో భారీ అవినీతి కొండ ఏసీబీ అధికారులకు దొరికింది. ఆ అనకొండ అక్రమంగా కూడబెట్టిన ఆస్తులు చూసి అధికారులే నివ్వెరపోయారు. హైదరాబాద్ మున్సిపల్ డెవలప్మెంట్ పట్టణ ప్రణాళిక

కౌశిక్‌రెడ్డి ఎన్నికల ప్రచారంపై గవర్నర్ సీరియస్.. చర్యలకు ఈసీకి ఆదేశం..

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డిపై(Padi Kaushikreddy) ఎన్నికల ప్రచారంపై గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్(Tamilisai) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో