ఆ నిర్మాతల కన్ను వారిపై పడింది..

  • IndiaGlitz, [Sunday,December 06 2015]

తొలి చిత్రం శ్రీమంతుడుతో వంద‌కోట్ల క‌లెక్ష‌న్స్‌ను సాధించి బాక్సాఫీస్ రికార్డును సాధించిన మైత్రీ మూవీ మేక‌ర్స్ తదుప‌రి చిత్రాన్ని కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలోనే ఎన్టీఆర్‌తో లాంచ్ చేశారు. ఈ సినిమా తర్వాత ఈ నిర్మాత‌లు య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, ఎర్నేని న‌వీన్‌, సి.వి.మోహ‌న్‌లు ప‌వ‌న్‌కల్యాణ్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో మూవీ ప్లాన్ చేస్తున్నారని స‌మాచారం. అందుకు కోసం వారు తీవ్ర ప్ర‌య‌త్నాలే చేస్తున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. జ‌ల్సా, అత్తారింటికి దారేది చిత్రాల కాంబినేష‌న్‌ను అన్నీ కుదిరితే 2016లో మ‌రోసారి మ‌న ముందుకు తీసుకుని వస్తార‌ట‌. అందుకు కోసం ప‌వ‌న్ కు భారీ మొత్తాన్ని కూడా ఇవ్వ‌డానికి వారు రెడీగా ఉన్నార‌ని స‌మాచారం.