విషాదం : నిర్మాత బీఏ రాజు మృతి

  • IndiaGlitz, [Saturday,May 22 2021]

టాలీవుడ్ లో మరో దుర్ఘటన జరిగింది. ప్రముఖ నిర్మాత, పిఆర్వో బీ ఏ రాజు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో టాలీవుడ్ ఈ ఉదయం మెల్కోవలసి వచ్చింది.

బీఏ రాజు కొంతకాలంగా డయాబెటిస్ తో బాధపడుతున్నారు. శుక్రవారం రాత్రి ఆయన షుగర్ లెవెల్స్ సడన్ గా పెరిగాయని, అందువల్ల గుండెపోటుకు గురయ్యారని ఆయన కుమారుడు శివకుమార్ తెలిపారు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. బీఏ రాజు సహృదయులు. టాలీవుడ్ ప్రముఖలందరితో ఆయనకు పరిచయాలు ఉన్నాయి.

బీఏ రాజు దాదాపు 1500 చిత్రాలకు పైగా పీఆర్వో గా పనిచేశారు. తన భార్య బి జయ దర్శకత్వం వహించిన చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఆయన సూపర్ హిట్ అనే పత్రికని కూడా నడిపిన సంగతి తెలిసిందే.

బీఏ రాజు మరణవార్త ఆయన కుటుంబ సభ్యులతోపాటు చిత్ర పరిశ్రమని విషాదంలోకి నెట్టివేసింది. ఆయనకు ఇద్దరు కుమారులు సంతానం. అందరితో సన్నిహితంగా మెలుగుతూ ఇండస్ట్రీలో జరిగే కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు. తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం రాజు మరణ వార్త విని సంతాపం తెలుపుతోంది.