ప్రియా వారియ‌ర్‌కు సుప్రీమ్‌లో ఊర‌ట‌...

  • IndiaGlitz, [Wednesday,February 21 2018]

'ఒరు అదార్ ల‌వ్‌' అనే మ‌ల‌యాళ సినిమాలో న‌టించిన హీరోయిన్ ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ రాత్రికి రాత్రే పెద్ద సెలబ్రిటీ అయ్యింది. అయితే ఆమెకు ఎంత ఫేమ్ వ‌చ్చిందో... అదెలా చిక్కులు కూడా వ‌చ్చి ప‌డ్డాయి. ఈ సినిమాలో విడుద‌లైన పాట వివాదానికి తావిచ్చింది. పాట ముస్లింల మ‌నోభావాల‌ను దెబ్బ తీసేలా ఉన్నాయ‌ని తెలంగాణ‌, మ‌హారాష్ట్ర పోలీస్ స్టేష‌న్స్‌లో ప‌లువురు ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ స‌హా సినిమా ద‌ర్శ‌క నిర్మాత‌లపై కేసులు పెట్టారు.

ఈ కేసుల విషయంలో క్రిమినల్ చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలంటూ ఇటీవ‌ల ప్రియా ప్రకాశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగ‌తి తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఇవాళ స్టే విధించింది. ప్రియాకు వ్య‌తిరేకంగా తెలంగాణ, మహారాష్ట్రల్లో నమోదైన కేసులపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది.

ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు న్యాయస్థానం నోటీసులు జారీ చేసిన స‌ర్వోన్న‌త న్యాయస్థానం దేశంలో ఎక్కడా కూడా నటి ప్రియపై, సినిమా దర్శక, నిర్మాతలపై క్రిమినల్ కేసులు నమోదు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది.

More News

చ‌ర‌ణ్ సినిమా బిజినెస్ క్రేజ్‌...

స్టార్ హీరోల సినిమాల‌కు సినిమా నిర్మాణం నుండే మంచి క్రేజ్ ఉంటుంది. సినిమా పూర్తి కాక‌ముందు అన్ని ఏరియాల బిజినెస్‌లు పూర్తవుతుంటాయి.

గోపీచంద్ చిత్రంలో మ‌రోసారి...

'ఆంధ్రుడు', 'య‌జ్ఞం', 'ల‌క్ష్యం', 'శౌర్యం', 'లౌక్యం' వంటి సూప‌ర్‌డూప‌ర్ చిత్రాలతో మెప్పించిన టాలీవుడ్ ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ క‌థానాయ‌కుడిగా శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇది గోపీచంద్ 25వ చిత్రం కావ‌డం విశేషం.

ముందుగానే 'కిరాక్ పార్టీ'

వ‌రుస విజ‌యాల‌తో, వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో దూసుకుపోతున్న యువ క‌థానాయ‌కుడు నిఖిల్ న‌టిస్తున్న చిత్రం 'కిరాక్ పార్టీ'.  ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. సిమ్ర‌న్ ప‌ర్జీనా, సంయుక్త హెగ్డే క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.

దేశ‌దిమ్మ‌రి కోసం త‌నీష్ గానం

యంగ్ హీరో త‌నీష్ దేశ‌దిమ్మ‌రి గా ముస్తాబౌతున్నాడు. స‌వీన క్రియేష‌న్స్ ప‌తాకంపై న‌గేష్ నార‌దాసి సార‌ధ్యంలో తెర‌కెక్కుతున్న దేశ‌దిమ్మ‌రిలో త‌నీష్ కు జోడీగా ష‌రీన్ హీరోయిన్ గా న‌టిస్తోంది.

'రాజరథం' లో నిరూప్ భండారి చెప్పిన 'దెయ్యం కథ'

నిరూప్ భండారి తన సోదరుడు అనూప్ భండారి దర్శకత్వంలో అత్యున్నత ప్రమాణాలతో  అందమైన ప్రేమకథ గా తెరకెక్కుతున్న 'రాజరథం' చిత్రీకరణ సమయంలో ఎన్నో సరదా సంఘటనలు జరిగినట్టు చెప్పారు.