వి.వి.వినాయక్ చేతుల మీదుగా ప్రేమికుడు ఆడియో రిలీజ్..

  • IndiaGlitz, [Monday,March 14 2016]
మాన‌స్.ఎన్, స‌న‌మ్ శెట్టి జంట‌గా క‌ళా సందీప్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ప్రేమికుడు. ఈ చిత్రాన్ని ఎస్.ఎస్.సినిమా బ్యాన‌ర్ పై ల‌క్ష్మీ నారాయ‌ణ‌రెడ్డి, సునీల్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. విజ‌య్ బాలాజీ సంగీతం అందించిన ప్రేమికుడు ఆడియో రిలీజ్ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి సెన్సేష‌నల్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ముఖ్యఅతిధిగా హాజ‌రై ఆడియో సి.డిను ఆవిష్క‌రించి తొలి సి.డి.ని డైరెక్ట‌ర్ ర‌వికుమార్ చౌద‌రికి అందించారు.
ఈ సంద‌ర్భంగా ....
వి.వి.వినాయ‌క్ మాట్లాడుతూ...సినిమా ట్రైల‌ర్, పాట‌లు చాలా బాగున్నాయి. కొత్త వాళ్లందూ క‌ల‌సి చేసిన ప్ర‌య‌త్నం స‌క్సెస్ అవ్వాల‌ని కోర‌కుంటున్నాను. మాన‌స్ చాలా అందంగా క‌నిపిస్తున్నాడు. కెమెరామెన్ శివ మంచి అవుట్ పుట్ ఇచ్చాడు. విజ‌య్ బాలాజీ మంచి ట్యూన్స్ అందించారు. ఈ సినిమా ఈ టీమ్ కి మంచి పేరు తీసుకువ‌స్తుంద‌ని ఆశిస్తున్నాను అన్నారు.
ద‌ర్శ‌కుడు క‌ళా సందీప్ మాట్లాడుతూ...నా మొద‌టి సినిమాకి బాలాజీ గారితో మ్యూజిక్ చేయించుకోవాల‌నుకున్నాను. నేను అనుకున్న విధంగా బాలాజీ గారితో మ్యూజిక్ చేయించ‌డం...పాట‌లు బాగా రావ‌డం ఆనందంగా ఉంది. మాన‌స్ పాత్ర‌కు త‌గ్గ‌ట్టు చాలా బాగా న‌టించాడు. ఈ సినిమాని ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.
మ్యూజిక్ డైరెక్ట‌ర్ విజ‌య్ బాలాజీ మాట్లాడుతూ...ఇది నా ఐద‌వ చిత్రం. ఈ సినిమాకి సాంగ్స్ బాగా వ‌చ్చాయంటే దానికి కార‌ణం డైరెక్ట‌ర్ క‌ళా సందీప్. ఈ సినిమా ఘ‌న విజ‌యం సాధించాలి అన్నారు.
హీరో మాన‌స్ మాట్లాడుతూ...ఈ సినిమా కోసం నెల్లూరులో ఎక్కువుగా భాగం షూటింగ్ చేసాం. అక్క‌డ ప్ర‌తి ఒక్క‌రు బాగా స‌పోర్ట్ చేసారు. ఈ సినిమాలో హిలేరియ‌స్ కామెడీ ఉంటుంది. ఈ సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది అన్నారు.
హీరోయిన్ స‌న‌మ్ శెట్టి మాట్లాడుతూ...సందీప్ క‌థ చెప్ప‌గానే నాకు ఎంత‌గానో న‌చ్చింది. అలాగే ఈ సినిమాలో న‌టించినందుకు సంతోషంగా ఉంది అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బెక్కం వేణుగోపాల్, ప‌ద్మిని, తుమ్మ‌ల‌ప‌ల్లి రామ స‌త్య‌నారాయ‌ణ‌, తాగుబోతు ర‌మేష్‌, అనితా చౌద‌రి, శ్రీరాం త‌దిత‌రులు పాల్గొన్నారు

More News

అల్లరి నరేష్ చేతుల మీదుగా రన్ ఆడియో రిలీజ్...

సందీప్ కిషన్,అనీషా అంబ్రోస్ జంటగా మిస్టర్ నూకయ్య ఫేం అని కన్నెగంటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం రన్.ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర సమర్పణలో సుధాకర్ చెరుకూరి,కిషోర్ గరికపాటి,అజయ్ సుంకర సంయుక్తంగా నిర్మించారు.

గోపీచంద్ వద్దన్నాడు..బన్ని చేస్తున్నాడు

స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్ ఇప్పుడు సరైనోడు చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. బొలివియాలో షూటింగ్ కూడా ముగిసింది. సినిమాను ఏప్రిల్ 22న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

స‌ర్ధార్ త‌ర్వాత ఇక రెండు లేక మూడు సినిమాలు చేస్తాను అంతే... - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ....ఈ పేరులో ఎంత ప‌వ‌ర్ ఉందో...ఈ పేరుకి ఎంత క్రేజ్ ఎందో అంద‌రికీ తెలిసిందే. కానీ...ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం ఇదంతా మాయ‌...ఆ దేవుడి ద‌య‌..అంటూ అధ్యాత్మికంగా మాట్లాడుతుంటారు.

మహిళల భద్రతపై చరణ్ కేర్

తెలంగాణ పోలీసులు హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో మహిళ రక్షణ జాగ్రత్తలు గురించి అవేర్ నెస్ ను క్రియేట్ చేయడానికి సంకల్పించారు. అందులో భాగంగా దాదాపు రెండు వేల మంది అమ్మాయిలు, మహిళలకు  రక్షణకు సంబంధించిన ప్రోగ్రాం నిర్వహిస్తారట.

ఫ్యాన్స్ కు సూర్య గిఫ్ట్

సూర్య హీరోగా, నిర్మాతగా రూపొందిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ 24. ఈ సినిమాలో సూర్య సరసన సమంత, నిత్యామీనన్ లు నటిస్తున్నారు. మనం ఫేమ్ విక్రమ్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.